News September 6, 2024
YS జగన్ కీలక నియామకం.. ఎవరీ ఆళ్ల మోహన్ సాయిదత్?
AP: ఎన్నికల్లో ఓటమి తర్వాత YCP పునర్నిర్మాణ దిశగా జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పార్టీ నిర్మాణంలో సలహాదారుగా ఆళ్ల మోహన్ సాయిదత్ను నియమించారు. ఈయన చెన్నై IITలో చదివారు. సాయిదత్ టీమ్ TG లోక్సభ ఎన్నికల్లో BJPకి పనిచేసింది. ఢిల్లీలో ఆ పార్టీ నాయకుడికి ఫీడ్బ్యాక్ టీమ్గానూ సేవలందించింది. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే ఈయన గతంలో మంగళగిరిలో లోకేశ్ వ్యూహకర్తగా పనిచేసినట్లు సమాచారం.
Similar News
News February 4, 2025
BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు
పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.
News February 4, 2025
ఐటీ విచారణకు దిల్ రాజు
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.
News February 4, 2025
US నుంచి స్వదేశానికి భారతీయ వలసదారులు
వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులను ట్రంప్ తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు వచ్చేసింది. భారత్కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో US మిలిటరీ విమానం టెక్సాస్లోని శాన్ ఆంటోనియో నుంచి ఇండియాకు బయలుదేరింది. కాగా అక్కడ 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు భారత్, US గుర్తించాయని ఇటీవల బ్లూమ్బెర్గ్ న్యూస్ పేర్కొంది.