News November 30, 2024

YS జగన్‌ ఫొటో మార్ఫింగ్.. కేసు పెడతామని TDPకి అంబటి హెచ్చరిక

image

AP: మాజీ సీఎం జగన్ ఫొటోను మార్ఫింగ్ చేసి టీడీపీ సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్టు <>చేయడంపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ‘ఈ విధంగా మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్తారు. కేసులు పెడతారు. మేం కూడా చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలను మార్ఫింగ్ చేయలేమా? ఈ అసభ్యకర పోస్టును తక్షణమే డిలీట్ చేయండి. లేదంటే చట్టపరమైన చర్యలకు వెళ్తాం జాగ్రత్త!’ అంటూ ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు.

Similar News

News February 19, 2026

చరిత్ర సృష్టించిన హర్మన్

image

భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించారు. అత్యధిక(356) అంతర్జాతీయ మ్యాచ్‌లు(టెస్టు, ODI, T20) ఆడిన ప్లేయర్‌గా నిలిచారు. ఇవాళ ఆసీస్‌తో రెండో టీ20 ఆడటం ద్వారా ఈ ఘనత సాధించారు. తర్వాతి స్థానాల్లో సుజీ బేట్స్(కివీస్-355M), ఎల్లీస్ పెర్రీ(ఆసీస్- 349M), మిథాలీ రాజ్(ఇండియా-333M) ఉన్నారు. కాగా ఇవాళ్టి మ్యాచ్‌లో భారత్‌పై 19 పరుగుల తేడాతో ఆసీస్ గెలిచింది.

News February 19, 2026

శివుడు విషం తాగిన శంఖం ఉంది ఇక్కడే..

image

మంధర పర్వతాన్ని చిలుకుతుండగా ఉద్భవించిన విషాన్ని శంఖంతో తాగి పరమశివుడు సమస్త లోకాన్ని రక్షించాడు. అయితే ఆ పర్వతం నేటి బీహార్‌లోని బాంకా జిల్లాలో ఉందని నమ్మకం. అలాగే ఇక్కడి ‘శంఖగుండం’ అనే నీటి మడుగులో ఆ దివ్య శంఖం ఉంటుందని చెబుతారు. ఏడాది పొడవునా 80 అడుగుల నీటితో నిండి ఉండే ఈ గుండం, కేవలం మహాశివరాత్రి పర్వదినాన మాత్రమే పూర్తిగా ఎండిపోయి, అడుగున ఉన్న శంఖం భక్తులకు దర్శనమిస్తుంది.

News February 19, 2026

EC ఫారం కోళ్లలో గురక వ్యాధిని నివారించాలంటే?

image

EC (ఎన్విరాన్‌మెంటల్ కంట్రోల్) ఫారంలో కోళ్లకు ఎక్కువగా CRD (గురక వ్యాధి) వస్తుంటుంది. దీనికి కారణం ఫారం లోపల అమ్మోనియా వాయువు ఎక్కువగా విడుదలవ్వడం. ఇలా రిలీజైన అమ్మోనియా వాయువును కోళ్లు ఎక్కువగా పీల్చడం వల్ల వాటికి ఈ గురక వ్యాధి వస్తుంది. దీని పరిష్కారంగా EC షెడ్‌కు రెండు వైపులా వాయువులను బయటకు పంపే ఫ్యాన్లను మాన్యువల్ పద్ధతిలో నడిపించాలి. దీని వల్ల అమ్మోనియా బయటకు పోయి కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.