News November 30, 2024

YS జగన్‌ ఫొటో మార్ఫింగ్.. కేసు పెడతామని TDPకి అంబటి హెచ్చరిక

image

AP: మాజీ సీఎం జగన్ ఫొటోను మార్ఫింగ్ చేసి టీడీపీ సోషల్ మీడియాలో అకౌంట్‌లో పోస్టు <>చేయడంపై<<>> మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ‘ఈ విధంగా మార్ఫింగ్ చేసి మా నాయకుడిపై పోస్టులు పెడుతూ మాకు నీతులు చెప్తారు. కేసులు పెడతారు. మేం కూడా చంద్రబాబు, లోకేశ్‌ ఫొటోలను మార్ఫింగ్ చేయలేమా? ఈ అసభ్యకర పోస్టును తక్షణమే డిలీట్ చేయండి. లేదంటే చట్టపరమైన చర్యలకు వెళ్తాం జాగ్రత్త!’ అంటూ ఏపీ పోలీసులను ట్యాగ్ చేశారు.

Similar News

News December 13, 2025

మెస్సీతో ఫొటో రూ.10లక్షలు.. ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే?

image

దిగ్గజ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీ భారత పర్యటన మొదలైంది. ఈ తెల్లవారుజామున కోల్‌కతా చేరుకున్న ఆయన సాయంత్రానికి HYD రానున్నారు. ఇక్కడ మ్యాచ్ అనంతరం ఫొటో సెషన్ ఉండనుంది. ఆయనతో ఫొటో దిగేందుకు రూ.10లక్షల ఫీజు నిర్ణయించగా 60 మంది రిజిస్టర్ చేసుకున్నట్లు HYD గోట్ టూర్ అడ్వైజర్ పార్వతీ రెడ్డి తెలిపారు. అటు ఇవాళ సాయంత్రం ఉప్పల్‌లో జరిగే ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం 27 వేల టికెట్లు బుక్ అయ్యాయి.

News December 13, 2025

SMAT: నలుగురు క్రికెటర్లు సస్పెండ్

image

SMATలో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలతో క్రికెటర్లు అమిత్, అహ్మద్, అమన్, అభిషేక్‌ను అస్సాం క్రికెట్ అసోసియేషన్(ACA) సస్పెండ్ చేసింది. ఆపై క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా FIR నమోదైంది. విచారణ పూర్తయ్యే వరకూ క్రికెట్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని వారిని ఆదేశించింది. వీళ్లు SMATలో ప్లేయర్లను ప్రభావితం చేసి అవినీతికి ప్రేరేపించినట్లు ఆరోపణలున్నాయి. అటు అస్సాం జట్టు SMAT సూపర్ లీగ్ దశకు చేరలేదు.

News December 13, 2025

గుమ్మం ముందు కూర్చొని ఈ పనులు చేస్తున్నారా?

image

ఇంటి గుమ్మంపై కూర్చోవడం, జుట్టు దువ్వడం, తినడం, అడుగు పెట్టడం వంటి పనులు చేయకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అలాగే తలుపు దగ్గర ఓ కాలు లోపల, మరో కాలు బయట పెట్టి నిలబడటం కూడా మంచిది కాదని చెబుతున్నారు. గుమ్మాన్ని కూడా దైవంలా భావించాలని, పూజించాలని ఫలితంగా శుభం కలుగుతుందని వివరిస్తున్నారు. SHARE IT