News March 26, 2025
సహకరించకపోతే జైలుకు పోతావని YS సునీత బెదిరించారు: కృష్ణారెడ్డి

వివేకా హత్య కేసుపై ఆయన PA కృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ రోజు దొరికిన లేఖను దాచిపెట్టాలని YS సునీత భర్త నర్రెడ్డి రాజశేఖర్ చెప్పారని తెలిపారు. పోలీసులతో సమస్య వస్తుందని చెప్పినా వినలేదన్నారు. ఢిల్లీలో CBI విచారణకు ఆయనే తనకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశారని చెప్పారు. సహకరించకపోతే జైలుకు పోతావని సునీత కూడా బెదిరించారని పేర్కొన్నారు. తనను కేసులో ఇరికించి ఇప్పుడు వారు బయట ఉన్నారని దుయ్యబట్టారు.
Similar News
News December 15, 2025
మాంసాహారం తిని గుడికి వెళ్లవచ్చా?

మాంసం తిని గుడికి వెళ్లడం శ్రేయస్కరం కాదని పండితులు చెబుతున్నారు. అందులో ఉండే తమో, రజో గుణాలు మనలో నిగ్రహాన్ని కోల్పోయేలా చేస్తాయని, తద్వారా పూజా ఫలితం దక్కదని అంటున్నారు. అందుకే గుడికి వెళ్లేటప్పుడు, దైవ కార్యాలు చేసేటప్పుడు కనీసం గుడ్లు కూడా ముట్టుకోవద్దంటున్నారు. అయితే సంపూర్ణ పూజా ఫలం దక్కాలంటే.. ఉల్లి, వెల్లుల్లి, మసాలా దినుసులు లేని ఆహారాన్నే స్వీకరించాలని సూచిస్తున్నారు.
News December 15, 2025
CSIR-UGC NET అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్లోడ్ చేసుకోండి

<
News December 15, 2025
IPL మాక్ వేలం.. గ్రీన్కు రూ.30.50 కోట్లు!

స్టార్ స్పోర్ట్స్ ఛానెల్ నిర్వహించిన IPL మాక్ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కళ్లుచెదిరే ధర పలికారు. KKRకు ప్రాతినిధ్యం వహించిన రాబిన్ ఉతప్ప అతడిని రూ.30.50 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ తర్వాత లివింగ్స్టోన్ను లక్నో రూ.19 కోట్లకు, మతీశా పతిరణను KKR రూ.13 కోట్లకు దక్కించుకున్నాయి. కాగా రేపు ఐపీఎల్ మినీ వేలం అబుదాబిలో జరగనుంది. మరి ఏ ప్లేయర్ ఎక్కువ ధర పలుకుతారో కామెంట్ చేయండి.


