News April 13, 2024
తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపింది: పవన్ కళ్యాణ్

AP: టీటీడీ నిధులను అడ్డగోలుగా వాడుకునే కుట్రలకు వైసీపీ నాయకులు తెరతీశారని, ఈ అంశంపై సమగ్ర సమాచారం తమ వద్ద ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుమల పవిత్రతను రాష్ట్ర ప్రభుత్వం మంటగలిపిందని విమర్శించారు. తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తిరుపతిలో దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని కూటమి నాయకులకు సూచించారు.
Similar News
News March 23, 2026
ఏప్రిల్ 3న ఓటీటీలోకి ‘సితారే జమీన్ పర్’

బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సితారే జమీన్ పర్’ సినిమా ఎట్టకేలకు OTTలోకి రానుంది. ఏప్రిల్ 3 నుంచి సోనీ లివ్లో స్ట్రీమింగ్ కానుంది. గతేడాది జూన్ 20న ఈ మూవీ రిలీజ్ కాగా రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఆగస్టు 1 నుంచి యూట్యూబ్లో ‘పే పర్ వ్యూ’ పద్ధతిలో అందుబాటులోకి తెచ్చారు. రూ.100 చెల్లించి చూసే అవకాశం కల్పించారు. ఇప్పుడు OTTలోకి వస్తోంది.
News March 23, 2026
మూడేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు: సీఎం చంద్రబాబు

AP: వచ్చే మూడేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని CM చంద్రబాబు తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వైపు వెళ్తున్నాం. ఇప్పటికే రూ.20లక్షల కోట్ల పెట్టుబడులు సాధించాం. విశాఖ, అమరావతి, తిరుపతిని 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. భోగాపురం విమానాశ్రయం దాదాపు పూర్తయింది. జులైలో ప్రారంభిస్తాం. రేర్ ఎర్త్ మినరల్ హబ్గా ఉత్తరాంధ్ర మారుతుంది’ అని పేర్కొన్నారు.
News March 23, 2026
OFFICIAL: సామ్ కరన్ స్థానంలో శనక

IPL-2026 ప్రారంభానికి ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టులో కీలక మార్పు జరిగింది. గాయపడిన ఇంగ్లండ్ ఆల్ రౌండర్ సామ్ కరన్ స్థానంలో శ్రీలంక టీ20 కెప్టెన్ దసున్ శనక(రూ.2కోట్లు)ను ఎంపిక చేసింది. గతంలో గుజరాత్ టైటాన్స్కు ఆడిన శనక.. తన అనుభవంతో రాజస్థాన్ మిడిల్ ఆర్డర్ను బలోపేతం చేస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కాగా ఆయన శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్లో 3350కి పైగా రన్స్, 86 వికెట్లు సాధించారు.


