News April 13, 2024

తిరుమల పవిత్రతను వైసీపీ మంటగలిపింది: పవన్ కళ్యాణ్

image

AP: టీటీడీ నిధులను అడ్డగోలుగా వాడుకునే కుట్రలకు వైసీపీ నాయకులు తెరతీశారని, ఈ అంశంపై సమగ్ర సమాచారం తమ వద్ద ఉందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలిపారు. తిరుమల పవిత్రతను రాష్ట్ర ప్రభుత్వం మంటగలిపిందని విమర్శించారు. తులసి వనం లాంటి తిరుపతిని గంజాయి వనం చేసిందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన అభ్యర్థిని గెలిపించాలని ఓటర్లను కోరారు. తిరుపతిలో దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని కూటమి నాయకులకు సూచించారు.

Similar News

News October 11, 2024

అప్పుడే బంధాలు మెరుగుపడతాయి.. కెన‌డాకు తేల్చిచెప్పిన భార‌త్‌

image

భార‌త వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన, ధ్రువీకరించదగిన చ‌ర్య‌లు తీసుకున్న‌ప్పుడే కెన‌డాతో బంధాలు మెరుగుపడతాయని భార‌త్ స్పష్టం చేసింది. భార‌త్‌-ఆసియ‌న్ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు సంద‌ర్భంగా PM మోదీని క‌లిసి వాస్త‌విక స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించిన‌ట్టు కెన‌డా PM ట్రూడో పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించిన విదేశాంగ శాఖ ఇరు దేశాధినేత‌ల మ‌ధ్య ఎలాంటి అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని పేర్కొనడం గమనార్హం.

News October 11, 2024

నోయల్ టాటా చరిత్ర ఘనం

image

1957లో జ‌న్మించిన నోయల్ టాటా UKలో విద్యాభ్యాసం చేశారు. 2000 ప్రారంభ ద‌శ‌కంలో టాటా గ్రూప్‌లో చేరి వ్యాపార సామ్రాజ్య విస్తరణలో కీలకపాత్ర పోషించారు. 1998లో ఒక స్టోర్ ఉన్న ట్రెంట్ రిటైల్‌ను సంస్థ MDగా 700 స్టోర్ల‌కు విస్త‌రించారు. $500M విలువగల టాటా ఇంట‌ర్నేష‌న‌ల్‌ను $3 బిలియ‌న్లకు తీసుకెళ్లారు. టాటా ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా ఆయ‌న ర‌త‌న్ టాటా ట్ర‌స్ట్‌, దొరాబ్జీ ట్ర‌స్టుల విధుల‌ను ప‌ర్య‌వేక్షిస్తారు.

News October 11, 2024

ట్రంప్ ఎన్నికల ప్రకటనల్లో తెలుగు కూడా!

image

అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారతీయుల్ని ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో భారత్‌పై ఆయన ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ప్రచార ప్రకటనల్ని కూడా భారతీయ భాషల్లోనే ఇస్తున్నారు. ముఖ్యంగా తమిళ, తెలుగు ప్రకటనలు చాలా చోట్ల దర్శనమిస్తున్నాయి. ‘సంస్కృతి-సన్మార్గం, దేశానికి ఆధారం. Vote Republican’ అంటూ పలు పోస్టర్లలో కనిపిస్తోంది.