News November 3, 2024

వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం: సజ్జల

image

AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. మహిళలపై నేరాలు, ఘోరాలు పెరిగిపోయాయని విమర్శించారు. ‘సీఎం కనీసం బడ్జెట్ కూడా ప్రవేశపెట్టలేకపోతున్నారు. ఓటాన్ అకౌంట్‌తోనే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. జగన్ చేసిన అప్పులు నిర్మాణాత్మకంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Similar News

News November 14, 2025

గొంతులో మటన్ ముక్క.. ఊపిరాడక వ్యక్తి మృతి

image

TG: నాగర్ కర్నూల్ జిల్లాలోని బొందలపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. నిన్న రాత్రి తాపీ మేస్త్రీలకు ఓ ఇంటి యజమాని దావత్ (విందు) ఏర్పాటు చేశారు. అక్కడ మటన్ తింటుండగా లక్ష్మయ్య (65) గొంతులో ముక్క ఇరుక్కుపోయింది. దీంతో ఆయన శ్వాస తీసుకునేందుకు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే చనిపోయాడు. గతంలోనూ పలుమార్లు ఇలాంటి ఘటనలు జరిగాయి.

News November 13, 2025

IPL: ఆ జట్టులోకి సచిన్ కొడుకు!

image

IPL: సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకున్నట్లు ESPNCricinfo తెలిపింది. ముంబై నుంచి రూ.30 లక్షల ధరకు లక్నోకు వెళ్లారని, త్వరలో అధికారిక ప్రకటన రానుందని పేర్కొంది. ఇతడిని 2021 వేలంలో రూ.20 లక్షలకు ముంబై కొనుగోలు చేసింది. 2025 వరకు కేవలం 5 మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం దక్కింది. IPL కెరీర్‌లో ఈ ఆల్‌రౌండర్ 3 వికెట్లు తీయడంతో పాటు 114 రన్స్ చేశారు.

News November 13, 2025

మహావిష్ణువు పేరును ఎందుకు స్తుతించాలి?

image

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమం|
స్తువన్నా మసహస్రేణ పురుషస్సతతోత్థితః||
భారతంలో భీష్ముడు, ధర్మరాజుకు ఈ శ్లోకాన్ని చెప్పారు. ‘జగత్ప్రభువు, దేవదేవుడు, అనంతుడు, పురుషోత్తముడు అయిన విష్ణువును వేయి నామాలతో స్తుతించిన పురుషుడికి నిత్యం శుభాలు కలుగుతాయి’ అనేది దీనర్థం. నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూ, ఆయన సేవ చేసే వ్యక్తికి ఎప్పుడూ మంచే జరుగుతుందని ఈ శ్లోకం వివరిస్తుంది. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>