News October 25, 2024
YSR క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి: CBN

AP: తానెప్పుడూ రాజకీయాల్లో కక్షసాధింపునకు పాల్పడలేదని CM చంద్రబాబు అన్నారు. ‘తొలిసారి నేను రూలింగ్లో ఉన్నప్పుడు YSR ప్రతిపక్షంలో ఉన్నారు. అసెంబ్లీలో ఆయన రెచ్చిపోయినా నేను సంయమనం పాటించేవాడిని. ఆ తర్వాత ఆయన సీఎం అయినప్పుడు దూకుడుగా వ్యవహరించేవాడు. అయినా నేను నిలదొక్కుకొని గట్టిగా వార్నింగ్ ఇచ్చా. దీంతో ఆయన తగ్గి నాకు క్షమాపణలు చెప్పిన సందర్భాలున్నాయి’ అని అన్స్టాపబుల్లో తెలిపారు.
Similar News
News October 16, 2025
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు? క్లారిటీ!

ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచేందుకు కేంద్రం కొత్త పాలసీని తీసుకొచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని PIB ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఇందులో నిజం లేదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచే ప్రతిపాదన ఏదీ తమ పరిశీలనలో లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుతం గవర్నమెంట్ ఎంప్లాయిస్ రిటైర్మెంట్ ఏజ్ 60 ఏళ్లుగా ఉంది.
News October 16, 2025
అఫ్గాన్కు భారత్ సపోర్ట్.. పాక్కు చావుదెబ్బ!

‘శత్రువుకు శత్రువు మనకు మిత్రుడు’ అని చాణక్యుడు చెప్పారు. TTP అధినేతను హతమార్చేందుకు పాక్ అటాక్ చేయడంతో అఫ్గాన్ యుద్ధానికి దిగింది. దీంతో ఆ రెండు దేశాలు బద్ధ శత్రువులుగా మారాయి. భారత్ రెచ్చగొట్టడం వల్లే అఫ్గాన్ తమపై దాడులు చేస్తోందని పాక్ పసలేని వాదనలు చేస్తోంది. తమ దేశాన్ని చక్కబెట్టుకోలేక మనపై ఏడుస్తోంది. ఈ క్రమంలో భారత్.. అఫ్గాన్కు <<18023858>>సపోర్ట్<<>> చేస్తున్నట్లు ప్రకటించి పాక్ను చావుదెబ్బ తీసింది.
News October 16, 2025
మహిళలకు చోటిస్తేనే..

ఆహార భద్రతను బలోపేతం చేయాలంటే మహిళలకు నిర్ణయ శక్తి ఇవ్వాలని ప్రపంచ ఆహార సంస్థ చెబుతోంది. వారికి భూమి హక్కులు, రుణ సౌకర్యాలు, శిక్షణ, అవగాహన కార్యక్రమాలు అందించడం ద్వారా ఆహార ఉత్పత్తి, నిల్వ, పంపిణీ వ్యవస్థలు బలోపేతం అవుతాయి. ఆకలి, పేదరికం, పోషకాహార లోపం తగ్గుతాయి. ఆహార భద్రతను సాధించడానికి ప్రభుత్వాలూ, NGOలతో కలిసి అందులో మహిళలకుచోటు కల్పించాలంటోంది ప్రపంచ ఆహార సంస్థ.