News February 25, 2025

బూతులు, గొడవలకు వైసీపీ నేతలు పర్యాయపదాలు: పవన్

image

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తుంటే YCP నేతలు ఇష్టారీతిగా ప్రవర్తించారని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘గవర్నర్ ప్రసంగాన్ని వాళ్లు బహిష్కరించడం బాధాకరం. MLAలు అందరికీ ఆదర్శంగా ఉండాలి. YCP నేతలు గొడవలు, బూతులకు పర్యాయపదాలుగా మారారు. చట్టాలు చేయాల్సిన వాళ్లే నియమాలు ఉల్లంఘిస్తే ఎలా? అసెంబ్లీలోనే ఇలా ప్రవర్తించిన వాళ్లు బయట ఇంకెలా ఉంటారో?’ అని సందేహం వ్యక్తం చేశారు.

Similar News

News October 30, 2025

అజహరుద్దీన్‌కు మంత్రి పదవి.. మరి ఎమ్మెల్సీ ఎప్పుడు?

image

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రాష్ట్ర మంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ప్రస్తుతం ఆయన MLA/MLC కాదు. ఈ రెండూ కాకపోయినా మంత్రివర్గంలో చేరవచ్చు. 6 నెలల్లోపు ఏదో ఒక పదవికి ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవి కోల్పోవాల్సిందే. గవర్నర్ కోటా MLCలుగా అజహరుద్దీన్, కోదండరామ్ పేర్లను ప్రభుత్వం 2నెలల కిందట సిఫారసు చేయగా గవర్నర్ జిష్ణుదేవ్ ఆమోదం తెలపలేదు. దీంతో గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News October 30, 2025

US కీలక నిర్ణయం.. ఇండియన్స్‌కు భారీ నష్టం!

image

ఎంప్లాయిమెంట్ ఆటోమేటిక్ ఆథరైజేషన్‌ను రద్దు చేస్తూ US నిర్ణయం తీసుకుంది. గతంలో వర్క్ పర్మిట్ రెన్యూవల్‌కు అప్లికేషన్ పెండింగ్‌లో ఉన్నా 540 రోజులు వర్క్ చేసే వీలుండేది. ఇప్పుడు గడువు ముగిసేలోగా రెన్యూవల్ కాకపోతే మైగ్రెంట్స్ వర్క్ పర్మిట్ ఆథరైజేషన్ కోల్పోతారు. గ్రీన్ కార్డ్ హోల్డర్స్ స్పౌజెస్(H4), H1Bs వీసా, STEM వర్క్ ఎక్స్‌టెన్షన్స్‌పై ఉన్న విద్యార్థులు, ఇండియన్ మైగ్రెంట్స్ నష్టపోయే ప్రమాదం ఉంది.

News October 30, 2025

PPPపై జోక్యానికి హైకోర్టు మరోసారి నిరాకరణ

image

AP: రాష్ట్రంలో 10 మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా హాస్పిటల్స్‌ను PPP విధానంలో నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు మరోసారి నిరాకరించింది. ‘ప్రారంభ దశలోనే ఉన్న టెండర్ ప్రక్రియను ఆపలేం. ప్రభుత్వం పిలవగానే ఇన్వెస్టర్స్ డబ్బు సంచులతో పరిగెత్తుకురారు కదా’ అని వ్యాఖ్యానించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి సమయమిస్తూ.. విచారణ 4 వారాలకు వాయిదా వేసింది.