News December 27, 2024
విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ నిరసన

AP: విద్యుత్ ఛార్జీల పెంపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా YCP నేతలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. మాయమాటలతో చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఎంపీ మిథున్ రెడ్డి దుయ్యబట్టారు. బాబు ష్యూరిటీ బాదుడు గ్యారంటీ అని మాజీ మంత్రి రోజా ఎద్దేవా చేశారు. గ్యారంటీలు అంటూ చంద్రబాబు అబద్ధాలు చెప్పారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి దుయ్యబట్టారు.
Similar News
News March 17, 2026
డిప్రెషన్ కూడా గుండెపోటుకు కారణమే!

గుండెపోటుకు కొలెస్ట్రాల్ మాత్రమే కారణం కాదని, మానసిక సమస్యలు, నిద్రలేమి కూడా ప్రధాన కారణాలని తాజా పరిశోధనలో వెల్లడైంది. 2.2కోట్ల మందిపై చేసిన అధ్యయనంలో.. డిప్రెషన్, యాంగ్జైటీ, PTSD వల్ల గుండెపోటు ముప్పు 3 రెట్లు పెరుగుతుందని తేలింది. ‘మానసిక ఒత్తిడి వల్ల రక్తపోటు పెరిగి ధమనులు దెబ్బతింటాయి. అందుకే గుండెను కాపాడుకునేందుకు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించండి’ అని వైద్యులు సూచిస్తున్నారు.
News March 17, 2026
డీఎంకే బెదిరించిందని ఆరోపణలు.. స్పందించిన రజినీకాంత్

రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ సమయంలో డీఎంకే ఆయన్ను బెదిరించిందని టీవీకే నేత ఆధవ్ అర్జున చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో సంచలనం రేపాయి. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ రజినీ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘ఆధవ్ అర్జున వ్యాఖ్యల్లో నిజం లేదు. ఆయన వ్యాఖ్యలను ఖండించి నాకు మద్దతుగా నిలిచిన నేతలకు, అభిమానులకు ధన్యవాదాలు. కాలం మాట్లాడకపోవచ్చు. కానీ వేచి ఉండి సమాధానం ఇస్తుంది’ అని పేర్కొన్నారు.
News March 17, 2026
గ్యాస్ వినియోగదారులకు కేంద్రం కీలక సూచన!

LPG వినియోగదారుల్లో eKYCపై నెలకొన్న గందరగోళంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ఇప్పటివరకు eKYC పూర్తి చేయనివారు మాత్రమే చేసుకోవాలని సూచించింది. ఈ ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసుంటే మళ్లీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ‘ఉజ్వల లబ్ధిదారులు మాత్రం ఏడాదికి ఒకసారి చేయాలి. అది కూడా 8, 9వ రీఫిల్స్పై సబ్సిడీ పొందడానికి ఇది అవసరం. దీనివల్ల గ్యాస్ సరఫరాకు ఎలాంటి అంతరాయం ఉండదు’ అని పేర్కొంది.


