News May 11, 2024

భారత్ జోడో యాత్రకు వైఎస్సారే స్ఫూర్తి: రాహుల్

image

AP: వైఎస్సార్ తనకు తండ్రిలా మార్గనిర్దేశం చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కడప సభలో తెలిపారు. ‘రాజీవ్ గాంధీ, రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ముల్లా ఉండేవారు. వైఎస్సార్ ఏపీకే కాదు మొత్తం దేశానికే దారి చూపించారు. నా భారత్ జోడో పాదయాత్రకు ఆయనే స్ఫూర్తి. దేశమంతా పాదయాత్ర చేయాలని, అప్పుడే ప్రజల సమస్యలు తెలుస్తాయని వైఎస్సారే నాకు చెప్పారు’ అని రాహుల్ గుర్తు చేసుకున్నారు.

Similar News

News November 11, 2025

‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటే అర్థం తెలుసా?

image

ప్రతి మంత్రాన్ని ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని ముగిస్తుంటాం. అంటే సమస్త దుఃఖాల నుంచి విముక్తి ప్రసాదించమని ఈశ్వరుడిని వేడుకోవడం. ఇందులో మూడు సార్లు ‘శాంతిః’ అని పలకడం ద్వారా మానవులను పీడించే త్రివిధ తాపాల నుంచి ఉపశమనం కోరడం. ఈ మూడు రకాల బాధలను దాటినప్పుడే మనకు మోక్షం, శాంతి లభిస్తాయని వేదాలు చెబుతున్నాయి. ☞ మరి ఆ మూడు రకాల తాపాలేంటి?, వాటి నుంచి ఎలా విముక్తి పొందాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 11, 2025

అనారోగ్యం దూరమవ్వాలంటే?

image

త్రివిధ తాపాల్లో మొదటిది ఆధ్యాత్మిక తాపం. ఈ బాధలు మనకు శరీరం, మనస్సు వలన అంతర్గతంగా కలుగుతాయి. అనారోగ్యం, సోమరితనం, కోరికలు, కోపం, అహంకారం వంటి దుర్గుణాలు ఇందులోకి వస్తాయి. ఈ బాధల నుంచి విముక్తి పొందడానికి ధ్యానం ఉత్తమ మార్గం. యోగాభ్యాసం, మనస్సుపై ఏకాగ్రత, ఆత్మ జ్ఞానాన్ని పెంచుకోవడం ద్వారా అంతరంగంలో శాంతిని పొందవచ్చు. స్వీయ నియంత్రణ సాధించి, దుర్గుణాలను జయిస్తే ఆధ్యాత్మిక దుఃఖాలు తొలగిపోతాయి.

News November 11, 2025

విద్యార్థులకు గుడ్ న్యూస్?

image

TG: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో వచ్చే ఏడాది నుంచి 5వ తరగతిలోనూ ప్రవేశాలు కల్పించే అవకాశముంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపేందుకు సిద్ధమైంది. దీనిపై త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని సమాచారం. సీట్ల కేటాయింపు, ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహణపై త్వరలోనే క్లారిటీ రానుంది. ప్రస్తుతం 6 నుంచి ఇంటర్ వరకు అడ్మిషన్లు తీసుకుంటున్న సంగతి తెలిసిందే.