News June 4, 2024
యూసుఫ్ పఠాన్ విజయం

పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరీపై 69వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధిర్ రంజన్ ఇక్కడ ఇప్పటివరకు 5 సార్లు వరుసగా గెలుపొందగా, ఈసారి మాత్రం ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. అటు కర్ణాటకలోని ధార్వాడ్లో కేంద్ర మంత్రి, BJP అభ్యర్థి ప్రహ్లాద్ జోషి 97,324 ఓట్ల తేడాతో INC అభ్యర్థి వినోద్ అసూతిపై గెలిచారు.
Similar News
News January 31, 2026
పాడి పశువులకు ‘దశరథ గడ్డి’తో కలిగే లాభాలివే

☛ దశరథ గడ్డిని ఆవులు, గేదెలకు ప్రతిరోజూ 2 కేజీల చొప్పున ఇస్తే పాల దిగుబడి, వెన్నశాతం వృద్ధి చెందుతుంది.
☛ మేకలు, గొర్రెలకు దాణా బదులుగా 50 శాతం ఈ గడ్డిని ఆహారంగా ఇస్తే వాటి పెరుగుదల బాగుంటుంది.
☛ లేయర్ (ఆడ) కోడిపిల్లలకు ఆహారంలో 6 శాతం ఈ గడ్డిని ముక్కలు చేసి వేస్తే గుడ్ల నాణ్యత పెరుగుతుంది.
☛ కుందేళ్లు, పందులకు ఈ గడ్డిని అందిస్తే వాటి పెరుగుదల వేగంగా ఉంటుంది.
News January 31, 2026
ఉచిత పథకాలతో ఆర్థిక వ్యవస్థకు ముప్పు: ఎకనామిక్ సర్వే

రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత పథకాలు ప్రజా ధనాన్ని హరిస్తూ మౌలిక సదుపాయాల కల్పనకు నిధులు లేకుండా చేస్తున్నాయని ఆర్థిక సర్వే 2025-26 హెచ్చరించింది. నగదు బదిలీ పథకాల వల్ల రాష్ట్రాల ఖర్చు భారీగా పెరిగినట్లు తెలిపింది. ఫలితంగా రోడ్లు, ఆసుపత్రులు వంటి మౌలిక సదుపాయాలకు నిధులు తగ్గినట్లు పేర్కొంది. ఈ పరిస్థితి మారాలంటే బ్రెజిల్లోని ‘బోల్సా ఫామిలియా’ వంటి ఫలితాల ఆధారిత నమూనాలను అనుసరించాలని సూచించింది.
News January 31, 2026
లడ్డూ నెయ్యి కల్తీ కనిపెట్టడంలో ప్రభుత్వ శాఖలూ వైఫల్యం

AP: శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీని కనిపెట్టడంలో ప్రభుత్వంలోని వివిధ శాఖల సిబ్బంది నిర్లక్ష్యం వహించారని CBI ఆధ్వర్యంలోని SIT ఆక్షేపించింది. రాష్ట్ర బాయిలర్, GST, జిల్లా ఇండస్ట్రీస్ విభాగాల సిబ్బంది విధులు సరిగా నిర్వహించలేదని పేర్కొంది. డెయిరీల బాయిలర్లను, నెయ్యి ట్యాంకర్లు వచ్చే రూట్ల చెక్ పోస్టులలో GST సిబ్బంది తనిఖీలు చేయలేదని నివేదించింది. వారిపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖలకు లేఖలు రాసింది.


