News June 4, 2024

యూసుఫ్ పఠాన్ విజయం

image

పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరీపై 69వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధిర్ రంజన్ ఇక్కడ ఇప్పటివరకు 5 సార్లు వరుసగా గెలుపొందగా, ఈసారి మాత్రం ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. అటు కర్ణాటకలోని ధార్వాడ్‌లో కేంద్ర మంత్రి, BJP అభ్యర్థి ప్రహ్లాద్ జోషి 97,324 ఓట్ల తేడాతో INC అభ్యర్థి వినోద్ అసూతిపై గెలిచారు.

Similar News

News January 7, 2026

మళ్లీ అదే సెంటిమెంట్‌ ఫాలో కానున్న నాగార్జున!

image

రా కార్తీక్ డైరెక్షన్‌లో సినీ హీరో నాగార్జున 100వ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. కాగా ఈ మూవీని నాగార్జునకు కలిసొచ్చిన డేట్ మే 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. గతంలో ‘విక్రమ్‌’, ‘మనం’ ఇదే తేదీన రిలీజై విక్టరీ కొట్టాయి. తాజా సినిమా విషయంలోనూ ఇదే సెంటిమెంట్‌ను ఫాలో కానున్నారని టాక్. ఈ చిత్రానికి ‘100 నాటౌట్’, ‘లాటరీ కింగ్’ అనే పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.

News January 7, 2026

డబ్బు ముందు ‘బంధం’ ఓడిపోయింది!

image

పోయే ఊపిరి నిలవాలంటే డబ్బే కావాలి అన్నాడు ఓ కవి. కానీ ఆ డబ్బుల కోసం కొందరు సొంత బంధాలను తెంచుకుంటున్నారు. నిజామాబాద్‌లో ప్రియుడితో కలిసి భర్తను భార్య హత్య చేసిన ఘటనలో సంచలన విషయం వెలుగుచూసింది. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం పక్కా ప్లాన్‌తో భర్తను హతమార్చినట్లు విచారణలో తేలింది. అంతకుముందు KNRలోనూ ఇన్సూరెన్స్ డబ్బులు కోసం అన్నను తమ్ముడు హతమార్చిన ఘటన మనుషుల మధ్య సంబంధాలను కాలరాస్తున్నాయి.

News January 7, 2026

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?

image

ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగడం మంచిది కాదని వైద్యులు చె‌బుతున్నారు. ‘అలా చేస్తే కడుపులోని జీర్ణ రసాలు పలుచబడతాయి. దీంతో ఫుడ్ సరిగా జీర్ణం కాదు. ఫలితంగా కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. నీటి అధిక పరిమాణం కడుపులో ఒత్తిడిని పెంచి, ఆహారాన్ని అరిగించాల్సిన యాసిడ్‌ను అన్నవాహికలోకి నెడుతుంది. ఫలితంగా గుండెల్లో మంటకు కారణమవుతుంది. అందుకే తిన్న తర్వాత 30-60 నిమిషాలు ఆగి వాటర్ తాగాలి’ అని సూచిస్తున్నారు.