News June 4, 2024

యూసుఫ్ పఠాన్ విజయం

image

పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్‌లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరీపై 69వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధిర్ రంజన్ ఇక్కడ ఇప్పటివరకు 5 సార్లు వరుసగా గెలుపొందగా, ఈసారి మాత్రం ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. అటు కర్ణాటకలోని ధార్వాడ్‌లో కేంద్ర మంత్రి, BJP అభ్యర్థి ప్రహ్లాద్ జోషి 97,324 ఓట్ల తేడాతో INC అభ్యర్థి వినోద్ అసూతిపై గెలిచారు.

Similar News

News February 20, 2026

ఐటీ రైడ్‌లో సీక్రెట్ రూమ్.. రూ.కోట్ల విలువైన బంగారం!

image

బాలీవుడ్ సినిమా ‘రైడ్’ తరహా ఘటన రాజస్థాన్‌లో జరిగింది. కన్హా గ్రూప్‌పై రూ.100 కోట్ల పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు 6 నగరాల్లో 3 రోజులుగా సోదాలు చేస్తున్నారు. ఇవాళ ఓ చోట సీక్రెట్ రూమ్ బయటపడింది. దాన్ని బద్దలుకొట్టి చూడగా రూ.కోట్ల విలువైన గోల్డ్ కనిపించింది. దాని విలువ ఎంత అనేది త్వరలో వెల్లడికానుంది. ఇప్పటి వరకు ₹50L నగదు, 10 బ్యాంక్ లాకర్లు, విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు.

News February 20, 2026

‘PhonePe’లో అదిరిపోయే ఫీచర్!

image

డిజిటల్ పేమెంట్స్ యాప్ ‘PhonePe’ ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. యాప్ గురించి సరిగ్గా అవగాహన లేనివాళ్లు కూడా ఈజీగా వినియోగించేలా AI-ఆధారిత సెర్చ్ ఫీచర్‌ను ప్రారంభించింది. దీనిద్వారా యూజర్లు టెక్స్ట్ లేదా వాయిస్ కమాండ్లతో పేమెంట్స్, రీఛార్జ్ వంటివి చేయొచ్చు. ఉదాహరణకు ‘FASTag రీఛార్జ్’ అని టైప్ చేస్తే నేరుగా ఆ పేజీకి తీసుకెళ్తుంది. ఇది డిజిటల్ చెల్లింపులను మరింత సులభతరం చేయనుంది. SHARE IT.

News February 20, 2026

4.43 నిమిషాల భేటీ… ఖర్చు రూ.17 లక్షలు

image

AP: సమస్యలపై చర్చించాల్సిన శాసనమండలి రెండు రోజులుగా TTD లడ్డూపై రాద్ధాంతంతో పట్టుమని 10 ని.లూ నడవడం లేదు. ఇవాళ మరీ దారుణం. ఉ.10కి ప్రారంభమైన మండలి సభ్యుల ఆందోళనలతో ఛైర్మన్ మోషేన్ రాజు 4.03 ని.ల లోపే సభను వాయిదా వేశారు. 2 గంటల అనంతరం సభ తిరిగి ప్రారంభమైనా అదే గందరగోళం కొనసాగడంతో 40 సెకన్లలోనే ముగించారు. GOVT గణాంకాల ప్రకారం ఒకరోజు పూర్తిగా సభ నిర్వహణకు రూ.17 లక్షల వరకు ప్రజాధనం ఖర్చవుతోంది.