News June 4, 2024
యూసుఫ్ పఠాన్ విజయం

పశ్చిమ బెంగాల్లోని బెర్హంపూర్లో మాజీ క్రికెటర్, టీఎంసీ అభ్యర్థి యూసుఫ్ పఠాన్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి అధిర్ రంజన్ చౌదరీపై 69వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అధిర్ రంజన్ ఇక్కడ ఇప్పటివరకు 5 సార్లు వరుసగా గెలుపొందగా, ఈసారి మాత్రం ఆయనకు ఓటర్లు షాకిచ్చారు. అటు కర్ణాటకలోని ధార్వాడ్లో కేంద్ర మంత్రి, BJP అభ్యర్థి ప్రహ్లాద్ జోషి 97,324 ఓట్ల తేడాతో INC అభ్యర్థి వినోద్ అసూతిపై గెలిచారు.
Similar News
News February 1, 2026
సెమీస్కు భారత్! పాక్ గెలిచినా ఇంటికే..

U19 వరల్డ్ కప్లో టీమ్ ఇండియా సెమీస్కు దూసుకెళ్లింది. భారత్ నిర్దేశించిన 253 పరుగుల లక్ష్యాన్ని <<19023246>>33.3<<>> ఓవర్లలోపు ఛేదించడంలో పాక్ విఫలమైంది. ఆ సమయానికి కేవలం 167/4 రన్స్ మాత్రమే చేయడంతో రన్రేట్ సమీకరణాల ప్రకారం భారత్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. పాకిస్థాన్ జట్టు గెలుపు కోసం పోరాడుతోంది. ఈ మ్యాచ్ పాక్ గెలిస్తే ఇండియా ఎల్లుండి ఆసీస్తో, ఓడితే FEB 4న ఆఫ్గాన్తో సెమీఫైనల్లో తలపడనుంది.
News February 1, 2026
ఫోన్ ట్యాపింగ్పై ఆదేశాలు ఇవ్వలేదు: KCR

TG: ఫోన్ ట్యాపింగ్పై తాను ఆదేశాలు ఇవ్వలేదని KCR సిట్ విచారణలో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘రాష్ట్రంలో జరిగే ప్రతి పరిణామంపై GOVTకి నివేదించాల్సిన బాధ్యత ఇంటెలిజెన్స్కు ఉంటుంది. MLAల కొనుగోలు సమాచారం అలాగే వచ్చింది. అదెలా సేకరించారో CMకు అవసరం లేదు కదా? అని ఎదురు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ ఫండ్ నుంచి ట్యాపింగ్ పరికరాలు కొనుగోలు చేయలేదని, ఆ అవసరం పార్టీకి లేదని చెప్పినట్లు తెలిసింది.
News February 1, 2026
KCR పేరు వింటేనే మీకు వణుకు: KTR

TG: KCRను సిట్ అధికారులు విచారించడంపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రంగా స్పందించారు. KCR వ్యక్తి కాదని, తెలంగాణ చరిత్ర అని కొనియాడారు. ఢిల్లీ ఒత్తిళ్లకు తలొగ్గని ధీశాలి.. ఇలాంటి చిల్లర రాజకీయాలకు భయపడరన్నారు. ‘మూర్ఖులు చరిత్రను సృష్టించలేరు. అర్థం కూడా చేసుకోలేరు. ఆయన పేరు వింటేనే మీకు వణుకు పుడుతుంది’ అంటూ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఏం చేసినా KCR కీర్తిని చెరిపేయలేరని ధీమా వ్యక్తం చేశారు.


