News September 21, 2024
యువీ ఆ రోజు ఏడు సిక్సులు కొట్టి ఉండేవారు: బ్రాడ్
2007 టీ20 వరల్డ్ కప్లో ఇంగ్లండ్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ ఓవర్లో యువరాజ్ సింగ్ 6 సిక్సులు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ రోజు అంపైర్ కారణంగా యువీ ఏడో సిక్స్ మిస్ అయిందని బ్రాడ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘ఆ ఓవర్ రీప్లే నేను మళ్లీ ఎప్పుడూ చూడలేదు. కానీ ఒక్క విషయం ఒప్పుకోవాలి. అంపైర్ చూడకపోవడం వల్ల ఆ ఓవర్లో ఓ నోబాల్ వేసినా తప్పించుకున్నాను. లేదంటే యూవీ 7 సిక్సులు కొట్టేసి ఉండేవారు’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News September 21, 2024
పవన్ను కలిసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి
AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను కలిశారు. రేపు జనసేనలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. రోశయ్యతోపాటు ఆయన వియ్యంకుడు రవిశంకర్ కూడా ఆ పార్టీలో చేరుతున్నారు. కాగా రోశయ్య ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. 2019లో పొన్నూరు నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2024 ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేతిలో ఓటమిపాలయ్యారు.
News September 21, 2024
జానీ మాస్టర్ భార్య అరెస్ట్కు రంగం సిద్ధం?
TG: అత్యాచార ఆరోపణలతో అరెస్టై చంచల్గూడ జైల్లో ఉన్న జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇదే కేసులో ఆయన భార్య ఆయేషాను పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బాధితురాలి ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసేందుకు యత్నించారన్న ఆరోపణలతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ యువతిని ఆయేషా బెదిరించినట్లు రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.
News September 21, 2024
దేశాన్ని విడదీయడానికి రాహుల్ వెనుకాడరు: కంగన
రాహుల్ గాంధీ అధికారం కోసం దేశాన్ని విడదీయడానికి వెనుకాడబోరని BJP MP కంగనా రనౌత్ విమర్శించారు. రాహుల్ విదేశాల్లో భారత్ గురించి ఎలాంటి విషయాలు మాట్లాడుతారన్నది అందరికీ తెలిసిన విషయమే అన్నారు. ‘కొంత మంది ప్రజల్ని వాడుకుంటున్నారు. కొన్ని వర్గాల్ని రెచ్చగొడుతున్నారు. దేశంపై రాహుల్కు ఉన్న భావనలు తెలిసిందే. అధికారం కోసం ఆయన దేశాన్ని విడదీయడానికి వెనుకాడరు’ అని కంగన విమర్శించారు.