News October 21, 2024

YVUలో నేటి నుంచి డిగ్రీ ఒకేషనల్ పరీక్షలు

image

యోగి వేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలో నాలుగేళ్ల యూజీ ఆనర్స్ ఒకేషనల్ 2వ సెమిస్టర్ పరీక్షలు, నేటినుంచి నిర్వహించనున్నట్లు YVU పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య ఎన్ ఈశ్వరరెడ్డి తెలిపారు. MLT, డైరీ సైన్స్ చదివే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాలన్నారు. ఈనెల 28వ తేదీ వరకు ప్రతిరోజు (27వ తేదీ మినహ) ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

Similar News

News October 30, 2025

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలి: RDO

image

PGRS ఫిర్యాదుల పరిష్కారానికి కృషి చేయాలని కడప RDO జాన్ ఇర్విన్ రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. సిద్దవటం MRO కార్యాలయంలో గురువారం PGRSపై సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజా వేదికలో ఫిర్యాదు చేసిన ఫిర్యాదు దారులతో RDO చరవాణిలో మాట్లాడారు. అలాగే ఆయన గోల్డెన్ రికార్డ్స్, రీసర్వేపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

News October 30, 2025

రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

కొండాపురంలోని పాత కొండాపురం సమీపంలో చిత్రావతి నది వంతెన సమీపంలో గురువారం రైలు కిందపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అతను రైలు కింద పడడంతో అతని తల, మొండెం రెండు భాగాలుగా విడిపోయాయి. మృతుడి ఒంటిపై పసుపు కలర్ చొక్కా, బ్లూ కలర్ పాయింట్ ఉన్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 30, 2025

ప్రొద్దుటూరు: కుమారుని వివాహానికి వెళ్తూ తండ్రి మృతి

image

నెల్లూరు జిల్లాలో కుమారుని వివాహానికి వెళ్తూ ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్ పాల్ (50) మృతి చెందారు. బుధవారం రాత్రి నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈయన మృతి చెందారు. దీంతో పెళ్లి ఇంట్లో విషాదం నెలకొంది. UPకి చెందిన సయ్యద్ పాల్ ప్రొద్దుటూరులో ఉంటున్నారు. ఆయనతో పాటు సమీప బంధువు సయ్యద్ ఆసిఫ్(20) కూడా మృతి చెందాడు.