News April 4, 2024
YVU: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో (ఈ నెల 4వ తేదీతో) ముగియనుందని అధికారులు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 8వ తేదీ వరకు ఉంటుందన్నారు. వివిధ డిగ్రీల పట్టాల కోసం ఇప్పటివరకు 11725 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.
Similar News
News December 21, 2025
YS జగన్కు బర్త్ డే విషెస్ చెప్పిన షర్మిల.!

ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు YS షర్మిల తన అన్న YCP అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ఆకాంక్షించారు. అన్నపై తనకున్న ప్రేమను చాటుకున్న ఈ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది.
News December 21, 2025
కడప: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

కడప జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. కడపలోని 47వ డివిజన్లోని కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు. మీ పిల్లలకూ చుక్కలు వేయించారా? లేదా?
News December 21, 2025
వ్యవసాయ రంగంతో కడప జిల్లాకు భారీ ఆదాయం.!

కడప జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నాటికి 40.27 లక్షల క్వింటాల్ల వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం జరిగింది. ప్రభుత్వానికి మార్కెట్ సెస్ రూపంలో రూ.7.09 కోట్లు రాబడి లభించింది. (రూ.లక్షల్లో) వరి-115.46, బియ్యం-25.12, వేరు శనగ-30.94, ప్రత్తి-94.77, ఉల్లి-13.29, పప్పు శనగ-16.91, కంది-1.19, బత్తాయి-13.73, పసుపు-92.90, మినుము-30.84, నువ్వులు-54.27, మొక్కజొన్న-62.86, ఇతర వాటినుంచి-157 రాబడి వచ్చింది.


