News April 4, 2024

YVU: నేటితో ముగియనున్న దరఖాస్తు గడువు

image

యోగి వేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ పట్టాలు పొందడానికి దరఖాస్తు స్వీకరణ గడువు నేటితో (ఈ నెల 4వ తేదీతో) ముగియనుందని అధికారులు తెలిపారు. ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 8వ తేదీ వరకు ఉంటుందన్నారు. వివిధ డిగ్రీల పట్టాల కోసం ఇప్పటివరకు 11725 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు.

Similar News

News March 9, 2026

పొద్దుటూరు ప్రభుత్వాసుపత్రిలో ఇద్దరి మృతి.!

image

పొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇద్దరు చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఆసుపత్రి పోలీసులు సోమవారం తెలిపారు. అనసూయ (60), ఓబులేసు(58) మృతి చెందారని అన్నారు. వీరి సంబంధీకులు ఎవరైనా ఉంటే ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి పోలీస్ అవుట్ పోస్ట్ (9490387344, 9154666607) నంబర్లను సంప్రదించాలన్నారు.

News March 9, 2026

బి.మఠం: అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లీబిడ్డా సేఫ్

image

అంబులెన్స్‌లో మహిళ ప్రసవించిన ఘటన కడప జిల్లాలో చోటుచేసుకుంది. బి.మఠం మండలం పలుగురాళ్లపల్లికి చెందిన గర్భిణి అపర్ణను పోరుమామిళ్ల నుంచి ప్రొద్దుటూరు ఆసుపత్రికి 108 అంబులెన్స్‌లో తరలిస్తుండగా.. మార్గమధ్యంలోనే అపర్ణ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారని అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ మహాలక్ష్మి, పైలట్ వెంకటేశ్వర్లు తెలిపారు. అంబులెన్స్ సిబ్బందిని పలువురు అభినందించారు.

News March 9, 2026

VRకు కడప జిల్లా కానిస్టేబుల్.!

image

కడప జిల్లా కలసపాడు పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కిషోర్‌ను VRకు పంపినట్లు SI సుహాన్ తెలిపారు. కిషోర్ కలసపాడు PSలో కోర్ట్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. విధులపట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో కడప జిల్లా SP నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో విఆర్‌కు పంపినట్లు కలసపాడు ఎస్సై వివరించారు.