News March 21, 2024
YVU కాన్వకేషన్ దరఖాస్తుల స్వీకరణ గడువు పెంపు

కడప: యోగి వేమన విశ్వవిద్యాలయం ఏప్రిల్ మాసంలో జరప తలపెట్టిన స్నాతకోత్సవంలో డిగ్రీ, పీజీ, పి.హెచ్.డి పట్టాలు పొందడానికి దరఖాస్తు గడువును ఈ నెల 21 నుంచి 30వ తేదీ వరకు పొడిగిస్తూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య చింతా సుధాకర్ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల అభ్యర్థనల మేరకు గడువు పొడిగిస్తున్నట్లు వీసీ వెల్లడించారు. ఇప్పటిదాకా వివిధ డిగ్రీల పట్టాల కోసం 8,898 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ఆయన తెలిపారు.
Similar News
News December 31, 2025
2025: 657 మంది మిస్సింగ్.. 593 మంది ఆచూకీ లభ్యం: ఎస్పీ

2024 ఏడాదిలో 571 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 540 మంది ఆచూకి కనుగొని, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్పీ నచికేత్ తెలిపారు. 2025 ఏడాదిలో 657 మిస్సింగ్ కేసులు నమోదు కాగా.. వారిలో 593 మంది ఆచూకి గుర్తించి, కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు తెలిపారు. గత ఏడాది 222 చీటింగ్ కేసులు నమోదు కాగా.. ఈ ఏడాదిలో 221 కేసులు నమోదయ్యాయని వివరించారు.
News December 31, 2025
కొత్తగా కడప జిల్లా..!

రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇప్పుడు కడప జిల్లా 40 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లుగా (బద్వేల్, కడప, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట) ఏర్పాటైంది. బద్వేల్ రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, కడపలో 9, జమ్మలమడుగులో 10, పులివెందులలో 8, రాజంపేటలో 4 మండలాలు ఉంటాయి. అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, మార్కాపురం, అనంతపురం, సత్యసాయి కడప జిల్లా బౌండరీలు.
News December 31, 2025
కొత్తగా కడప జిల్లా..!

రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలో కలుపుతూ ప్రభుత్వం తుది నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఇప్పుడు కడప జిల్లా 40 మండలాలు, 5 రెవెన్యూ డివిజన్లుగా (బద్వేల్, కడప, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట) ఏర్పాటైంది. బద్వేల్ రెవెన్యూ డివిజన్లో 9 మండలాలు, కడపలో 9, జమ్మలమడుగులో 10, పులివెందులలో 8, రాజంపేటలో 4 మండలాలు ఉంటాయి. అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి, మార్కాపురం, అనంతపురం, సత్యసాయి కడప జిల్లా బౌండరీలు.


