News December 16, 2024
జాకీర్ హుస్సేన్ చనిపోలేదు: ఫ్యామిలీ

ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ చనిపోయినట్లు వస్తున్న వార్తలను ఆయన కుటుంబ సభ్యులు ఖండించినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, గుండె సంబంధిత సమస్యలతో శాన్ ఫ్రాన్సిస్కోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపాయి. ఆయన మరణించినట్లు వార్తలు రావడంతో చాలా మంది ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


