News October 27, 2025
7,993 ప్రభుత్వ స్కూళ్లలో జీరో అడ్మిషన్లు

2024-25 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా 7,993 ప్రభుత్వ స్కూళ్లలో జీరో అడ్మిషన్లు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క విద్యార్థి కూడా చేరని స్కూళ్లు అత్యధికంగా ప.బెంగాల్లో(3,812) ఉన్నాయి. తర్వాతి స్థానంలో తెలంగాణ(2,245) ఉంది. 2023-24తో పోలిస్తే జీరో అడ్మిషన్ పాఠశాలల సంఖ్య 4,961 తగ్గింది. సదరు పాఠశాలల్లో విద్యార్థుల్లేకున్నా WBలో 17,965 మంది, TGలో 1,016 మంది టీచర్లుండటం గమనార్హం.
Similar News
News October 27, 2025
7,267 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో 7,267 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. PGT, TGT, వార్డెన్(M, F), స్టాఫ్ నర్స్(F) తదితర పోస్టులున్నాయి. పోస్టును బట్టి PG, B.Ed, డిగ్రీ, BSc నర్సింగ్, ఇంటర్, టెన్త్, డిప్లొమా పాసైన వారు అర్హులు. వెబ్సైట్: nests.tribal.gov.in. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్<<>> కేటగిరీకి వెళ్లండి.
News October 27, 2025
అమ్మాయిలు గూగుల్లో వెతికే టాప్-5 టాపిక్స్!

ఇండియన్ టీనేజీ అమ్మాయిలు గూగుల్లో వినోదం మాత్రమే కాకుండా తమ పర్సనల్ లైఫ్ కోసం సెర్చ్ చేస్తున్నట్లు పలు నివేదికల్లో తేలింది. బ్యూటీ&మేకప్(35%), ఫ్యాషన్ (25%), కొరియన్ డ్రామాలు(18%), హెల్త్&ఫిట్నెస్(12%), స్టడీస్&కెరీర్(10%) టాపిక్స్ గురించి అధికంగా శోధిస్తున్నారు. ఇక ఇతరులను అడగలేని సున్నితమైన సమస్యలకు సమాధానాల కోసం ఇంటర్నెట్ను ఆశ్రయిస్తున్నట్లు తేలింది.
News October 27, 2025
వైద్యురాలి ఆత్మహత్య.. సంచలన ఆరోపణలు

MHలో సూసైడ్ చేసుకున్న <<18107450>>వైద్యురాలిపై<<>> ఓ మహిళ సంచలన ఆరోపణలు చేశారు. ‘గతంలో నా కూతురిని ఆమె భర్త అజింక్య(ఆర్మీ ఆఫీసర్), అత్తింటివాళ్లు చంపేశారు. కానీ సూసైడ్ చేసుకుందని లేడీ డాక్టర్ ఫేక్ పోస్టుమార్టం రిపోర్ట్ ఇచ్చింది. ఆమెను ఎవరో ఒత్తిడి చేసినందుకే ఈ పని చేసింది. దీనిపై విచారణ జరపాలి’ అని పేర్కొన్నారు. కాగా SI గోపాల్తో పాటు ఓ MP తనను వేధించారంటూ సదరు వైద్యురాలు సూసైడ్ నోట్లో రాసిన విషయం తెలిసిందే.


