News April 29, 2024
జీరో కరెంటు బిల్లే నా లక్ష్యం: మోదీ

దేశంలో ప్రతి ఇంటిపై సోలార్ రూఫ్టాప్స్ ఏర్పాటు చేసి కరెంటు బిల్లులు సున్నా చేయడమే తన లక్ష్యం అన్నారు ప్రధాని మోదీ. ‘అందరి ఇళ్లకు కరెంటు బిల్లు సున్నా కావాలి. మిగులు విద్యుత్తో ఆదాయం రావాలి. ఈవీల హవా రానున్న నేపథ్యంలో విద్యుత్ రంగంలో స్వావలంబన సాధించాలి. సోలార్ కనెక్షన్లు వస్తే ఈవీల ఛార్జింగ్ సులభమవుతుంది. పెట్రోల్, డీజిల్ కోసం నెలకు అయ్యే రూ.1000-2000 ఖర్చు కూడా ఉండదు’ అని పేర్కొన్నారు.
Similar News
News January 24, 2026
ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్.. ధర ఎంతంటే?

iPhone 18 ప్రో సిరీస్కు సంబంధించిన కీలక వివరాలు లీక్ అయ్యాయి. ఐఫోన్ 18 ప్రో, ప్రో మ్యాక్స్ డైనమిక్ ఐలాండ్తో కాకుండా అండర్ డిస్ప్లే ఏరియాతో రానున్నట్లు సమాచారం. కొత్తగా 2nm టెక్నాలజీతో తయారైన A20 ప్రో చిప్తో పాటు కెమెరాలో మెకానికల్ ఐరిస్ వంటి ఫీచర్లు వచ్చే అవకాశం ఉంది. భారత్లో ఈ ఏడాది సెప్టెంబరులో లాంచ్ కావొచ్చు. ధర విషయానికి వస్తే 18 ప్రో రూ.1,34,900, ప్రో మ్యాక్స్ రూ.1,49,900గా ఉండొచ్చు.
News January 24, 2026
468రోజుల తర్వాత సూర్యకుమార్ హాఫ్ సెంచరీ

భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ రెండో T20లో పరుగుల వరద పారించారు. 23 ఇన్నింగ్సుల(468 రోజులు) సుధీర్ఘ ఎదురు చూపులకు హాఫ్ సెంచరీతో చెక్ పెట్టారు. అది కూడా 23 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. T20WC నేపథ్యంలో తన ఫామ్పై వస్తున్న అనుమానాలను ఈ ఇన్నింగ్స్తో పటాపంచలు చేశారు. అలాగే సూర్య భారత్ తరఫున అత్యధిక T20I మ్యాచులు(126) ఆడిన లిస్ట్లో కోహ్లీ(125)ని దాటేశారు. రోహిత్(159) తొలిస్థానంలో ఉన్నారు.
News January 24, 2026
జనవరి 24: చరిత్రలో ఈరోజు

1757: బొబ్బిలి యుద్ధం ప్రారంభం
1950: జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా స్వీకరించిన భారత ప్రభుత్వం
1966: భారత ప్రధానిగా ఇందిరా గాంధీ(ఫొటోలో) బాధ్యతలు స్వీకరణ
1966: అణు శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా మరణం
1981: సినిమా నటి కాంచనమాల మరణం
* జాతీయ బాలికా దినోత్సవం


