News September 25, 2024
రూ.లక్ష కోట్ల ప్రాఫిట్లో జెరోదా ట్రేడర్లు

FY24లో జెరోదా 62% వృద్ధితో రూ.4700 కోట్ల ప్రాఫిట్ ఆర్జించినట్టు ఫౌండర్ నితిన్ కామత్ తెలిపారు. రెవెన్యూ 21% వృద్ధితో రూ.8320 కోట్లుగా ఉందన్నారు. ‘జెరోదా ట్రేడర్లు ప్రస్తుతం రూ.లక్ష కోట్ల అన్రియలైజ్డ్ ప్రాఫిట్తో ఉన్నారు. మా కస్టడీలోని అసెట్స్ విలువ రూ.5.66 లక్షల కోట్లు. ఇండెక్స్ డెరివేటివ్స్ ద్వారా మాకు ఎక్కువ రెవెన్యూ వస్తోంది. రూల్స్లో మార్పు జరిగితే అందులో 30-50% కోత పడొచ్చు’ అని చెప్పారు.
Similar News
News November 7, 2025
సిరీస్పై భారత్ కన్ను!

ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో 2-1తో లీడ్లో ఉన్న భారత్ రేపు జరిగే చివరి(5వ) మ్యాచులోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోల్పోగా ఇదైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది. అయితే మ్యాచ్ జరిగే గబ్బా(బ్రిస్బేన్) గ్రౌండ్లో ఆసీస్కు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2006 నుంచి ఇక్కడ ఆ జట్టు 8 టీ20లు ఆడగా కేవలం ఒక్కదాంట్లోనే ఓడింది. దీంతో ఆసీస్ను ఇండియా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
News November 7, 2025
MP అకౌంట్ నుంచి ₹56 లక్షలు మాయం చేసిన సైబర్ నేరగాళ్లు

TMC MP కళ్యాణ్ బెనర్జీ బ్యాంక్ అకౌంట్ నుంచి సైబర్ నేరగాళ్లు ₹56L మాయం చేశారు. బెనర్జీ MLAగా ఉన్నప్పుడు కోల్కతాలోని SBI హైకోర్టు బ్రాంచిలో తీసిన అకౌంట్ చాలాకాలంగా ఇనాక్టివ్గా ఉంది. ఇటీవల నేరగాళ్లు మార్ఫ్డ్ పత్రాలు, ఫొటోలతో KYCలో ఫోన్ నంబర్ మార్చి డబ్బు మాయం చేశారు. MP ఫిర్యాదుతో అధికారులు కేసు పెట్టారు. ‘బ్యాంకులో ఉంచితే క్రిమినల్స్, ఇంట్లో ఉంచితే మోదీ తీసుకుంటారు’ అని బెనర్జీ విమర్శించారు.
News November 7, 2025
డిసెంబర్ 30 నుంచి వైకుంఠ ద్వార దర్శనం: టీటీడీ

AP: తిరుమలలో DEC 30 నుంచి జనవరి 8 వరకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనున్నట్లు EO అనిల్ సింఘాల్ తెలిపారు. ఇందుకు సంబంధించి టోకెన్ల జారీ వివరాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. ఈ నెల 17 నుంచి 25 వరకు కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగప్రదక్షిణ టోకెన్ల జారీని డిప్ విధానం నుంచి మార్చామని, ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన 2026 FEB నుంచి ఆన్లైన్ కోటా రిలీజ్ చేస్తామన్నారు.


