News July 14, 2024

ఫుడ్ డెలివరీ చేయని జొమాటో.. మహిళకు రూ.60వేల పరిహారం

image

మొమోస్ ఆర్డర్ చేసిన మహిళకు వాటిని అందించకుండా డబ్బు తీసుకున్న జొమాటోకు కర్ణాటక వినియోగదారుల కోర్టు షాకిచ్చింది. మొత్తం రూ.60వేల పరిహారాన్ని ఆమెకు చెల్లించాలని ఆదేశించింది. గత ఏడాది ఆగస్టు 31న శీతల్ అనే మహిళ జొమాటోలో మొమోస్ ఆర్డర్ చేసి రూ.133 చెల్లించారు. అయితే ఫుడ్ డెలివరీ కాకుండానే అయినట్లు ఆమెకు మెసేజ్ వచ్చింది. దీనిపై కంప్లైంట్ ఇచ్చినా సంస్థ పట్టించుకోలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించారు.

Similar News

News November 24, 2025

ఫిలింఫేర్ అవార్డుపై ధర్మేంద్రకు అసంతృప్తి

image

నటనలో శిక్షణ తీసుకోకుండానే ఇండస్ట్రీలోకి వచ్చి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు ధర్మేంద్ర. ఎన్నో సినిమాల్లో నటించి సక్సెస్‌ అయినా ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు లభించలేదనే అసంతృప్తి ఉండేదని పలుమార్లు చెప్పేవారు. 1997లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం ఆనందాన్నిచ్చిందని ఉద్వేగభరితంగా చెప్పుకున్నారు. ‘గరమ్ ధరమ్ దాబా’, ‘హీ మ్యాన్’ బ్రాండ్లతో రెస్టారెంట్ వ్యాపారంలో భాగస్వామిగా ఉన్నారు.

News November 24, 2025

ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌పై సీఎం సమీక్ష

image

APలో కొత్తగా ఏర్పాటుచేయనున్న ‘ఫ్యామిలీ బెనిఫిట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్’పై CM చంద్రబాబు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రియల్‌టైమ్ గవర్నెన్స్ డేటా ద్వారా సంక్షేమ పథకాలు, పౌర సేవల అమలు తీరును పర్యవేక్షించేలా ఈ సిస్టమ్ పనిచేయనుంది. దీనివల్ల అర్హులందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలు ఉంటుంది. కాగా కాసేపట్లో కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్లలో మార్పులపై మంత్రివర్గ ఉపసంఘంతో CM సమావేశం కానున్నారు.

News November 24, 2025

శరణు ఘోషతోనే కొండ ఎక్కుతారు

image

శబరి యాత్రలో ఎత్తైన, నిట్టనిలువు కొండ ‘కరిమల’. సుమారు 10KM ఎత్తుకు వెళ్లిన తర్వాత భక్తులు దీని శిఖరాన్ని చేరుకుంటారు. ఇక్కడ అతి ప్రాచీనమైన బావి, జలపాతం ఉన్నాయి. భక్తులు ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటారు. ఇంత ఎత్తులో జలపాతం ఉండటం దీని ప్రత్యేకత. ఈ కొండ ఎక్కడం ఎంత కష్టమో దిగడం కూడా అంతే కష్టం. ‘స్వామియే శరణమయ్యప్ప’ అనే శరణు ఘోష ముందు ఈ కష్టం దూది పింజెలా తేలిపోతుంది. <<-se>>#AyyappaMala<<>>