News November 11, 2024

ఆహారం వృథా కాకుండా జొమాటో కొత్త పథకం

image

ఆహారం ఆర్డర్ చేసిన వారు వివిధ కారణాలతో దాన్ని రద్దు చేసుకున్నప్పుడు అది వృథా అవుతుంటుందన్న సంగతి తెలిసిందే. ఆ వృథాను అరికట్టేందుకు కొత్త ఆఫర్‌ని తీసుకొచ్చినట్లు జొమాటో ఫౌండర్ దీపిందర్ గోయల్ వెల్లడించారు. ఎవరైనా రద్దు చేసుకున్న ఆర్డర్‌ను ఆ తర్వాతి 2 లేదా 3 నిమిషాల్లో తక్కువ ధరకు వేరే వినియోగదారులకు కేటాయించనున్నట్లు ప్రకటించారు. దీన్ని ‘ఫుడ్ రెస్క్యూ’గా వ్యవహరిస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 19, 2025

ఈ నెలాఖరులోగా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్?

image

TG: BCలకు పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించడంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఊపందుకుంది. 50%లోపు రిజర్వేషన్లతో డెడికేటెడ్ కమిషన్ 2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఆ తర్వాత రిజర్వేషన్లను ఫైనల్ చేసి గెజిట్ జాబితాను ECకి అందిస్తారు. ఈ నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు సమాచారం. DEC 25లోగా 3 విడతల్లో ఎలక్షన్స్ పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

News November 19, 2025

బంధంలో సైలెంట్ కిల్లర్

image

కొంతమంది మాట్లాడకుండా కూడా వేధిస్తుంటారు. దీనినే స్టోన్ వాలింగ్ అంటారు. వీరు ఇతరులతో పెద్దగా మాట్లాడరు. సీరియస్‌గా మాట్లాడుతున్నా కూడా సమాధానం చెప్పకుండా ముభావంగా ఉండడమో, మధ్యలోనే వెళ్లిపోవడమో చేస్తుంటారు. కొందరు అక్కర్లేని విషయాల గురించి ప్రస్తావిస్తుంటారు. కొన్నిసార్లు అసలు విషయం చెప్పకుండా ఆరోపణలు చేస్తుంటారు. ఇలాంటివారు తమ చేష్టలతో జీవిత భాగస్వామికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తారు.

News November 19, 2025

హిడ్మా ఎన్‌కౌంటర్‌లో ఏపీ పోలీసుల సక్సెస్

image

ఛత్తీస్‌‌గఢ్‌లో జన్మించిన హిడ్మాకు దక్షిణ బస్తర్ ప్రాంతంలో గట్టి పట్టు ఉండేది. చాలాసార్లు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నాడు. ఇతడిని అంతం చేస్తే చాలు మావోయిజం అంతం అవుతుందని పోలీసులు భావించేవారు. కొన్ని నెలలుగా వరుస ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఛత్తీస్‌గఢ్‌ సేఫ్ కాదని భావించిన హిడ్మా.. ఏపీవైపు వచ్చాడని తెలుస్తోంది. గత నెల నుంచే అతడిపై నిఘా వేసిన ఏపీ పోలీసులు పక్కా వ్యూహంతో హిడ్మాపై దాడి చేశారు.