News February 27, 2025
జూ పార్క్ టికెట్ ధరలు భారీగా పెంపు

TG: హైదరాబాద్ నెహ్రూ జూపార్కులో వివిధ టికెట్ ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎంట్రన్స్ టికెట్ పెద్దలకు రూ.75, పిల్లలకు రూ.45 ఉండగా.. ఇక నుంచి రూ.100, రూ.50 వసూలు చేస్తామని అధికారులు ప్రకటించారు. ట్రైన్ రైడ్ టికెట్ పెద్దలకు రూ.80, పిల్లలకు రూ.40గా నిర్ణయించారు. బ్యాటరీ వెహికల్ రైడ్ ధర రూ.120 అని తెలిపారు. అలాగే పార్కింగ్ ధరలు సైతం పెంచారు. మార్చి 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయన్నారు.
Similar News
News November 17, 2025
BRIC-THSTIలో ఉద్యోగాలు

BRIC-ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్& టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ (<
News November 17, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 7

38. దేనిని నిగ్రహిస్తే సంతోషం కలుగుతుంది? (జ.మనస్సు)
39. ఎవరితో సంధి శిథిలమవదు? (జ.సజ్జనులతో)
40. ఎల్లప్పుడూ తృప్తిగా పడియుండునదేది? (జ.యాగకర్మ)
41. లోకానికి దిక్కు ఎవరు? (జ.సత్పురుషులు)
42. అన్నోదకాలు వేటి నుంచి ఉద్భవిస్తాయి? (జ.భూమి, ఆకాశములందు)
43.లోకాన్ని కప్పివున్నది ఏది? (జ.అజ్ఞానం)
44. శ్రాద్ధవిధికి సమయమేది? (జ.బ్రాహ్మణుడు వచ్చినప్పుడు) <<-se>>#YakshaPrashnalu<<>>
News November 17, 2025
iBOMMA కేసు.. పోలీసులపై మీమ్స్ చేస్తే చర్యలు: సజ్జనార్

iBOMMA రవి గురించి మాజీ భార్య సమాచారం ఇచ్చిందన్న వార్తలను HYD CP సజ్జనార్ ఖండించారు. అతని గురించి తమకు ఎవరూ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని, పోలీసులే స్వతహాగా పట్టుకున్నారని స్పష్టం చేశారు. రవి అరెస్టు తర్వాత పోలీసులపై చాలా మంది మీమ్స్ చేశారని, వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రవి మహారాష్ట్ర, ఏపీ నుంచి ప్రహ్లాద్ కుమార్ పేరిట డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు తీసుకున్నాడు అని చెప్పారు.


