News January 15, 2025
జుకర్బర్గ్ కామెంట్స్: మోదీ సర్కారుకు మెటా క్షమాపణ

మోదీ సర్కారుకు మెటా క్షమాపణ చెప్పింది. తమ అధినేత మార్క్ జుకర్బర్గ్ పొరపాటున నోరు జారారని తెలిపింది. భారత్ తమకు అత్యంత కీలకమంది. రీసెంటుగా ఓ పాడ్కాస్టులో 2024 ఎన్నికల్లో భారత్ సహా అనేక దేశాల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని మార్క్ అన్నారు. దీనిపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. IT పార్లమెంటరీ ప్యానెల్ హెడ్ MP నిశికాంత్ మెటా అధికారులను పిలిపిస్తామని హెచ్చరించారు. దీంతో సంస్థ దిగొచ్చింది.
Similar News
News October 27, 2025
లాభాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో వారం ప్రారంభంలో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 300 పాయింట్లు లాభపడి 84,506 వద్ద, నిఫ్టీ 90 పాయింట్లు వృద్ధి చెంది 25,885 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మెటల్, బ్యాంకింగ్ షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. టాటా స్టీల్, రిలయన్స్, ఎయిర్టెల్, SBI, HDFC, టెక్ మహీంద్రా, NTPC, ICICI, యాక్సిస్ బ్యాంక్ షేర్లు టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
News October 27, 2025
ఉపనిషత్తుల గురించి ఇవి మీకు తెలుసా..?

భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానంలో ఉపనిషత్తులు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి వేదాల అంత్య భాగాలైనందున వేదాంతాలని అంటారు. ‘ఉపనిషత్’ అంటే గురువు సన్నిధిలో పొందే ఆత్మజ్ఞానం. జగద్గురు ఆది శంకరాచార్యులు 11 ఉపనిషత్తులకు వివరణ రాశారు. నిజమైన సుఖం, ఆనందం కేవలం బయటి వస్తువుల ద్వారా కాక, ఆత్మజ్ఞానం ద్వారా మాత్రమే లభిస్తుందని ఉపనిషత్తుల సారం బోధిస్తుంది. ఇవి మోక్ష మార్గాన్ని సులభతరం చేస్తాయి. <<-se>>#VedikVibes<<>>
News October 27, 2025
త్వరలోనే మార్కాపురం కేంద్రంగా జిల్లా!

AP: పశ్చిమ ప్రకాశం ప్రజల చిరకాల కోరిక అయిన మార్కాపురం జిల్లా కల త్వరలోనే సాకారం కానుంది. ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇవ్వగా, క్యాబినెట్ సబ్ కమిటీ కూడా జిల్లాను ప్రతిపాదించింది. దీంతో మార్కాపురం కేంద్రంగా కనిగిరి, గిద్దలూరు, యర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం నియోజకవర్గాలతో జిల్లా ఏర్పాటు కానున్నట్లు తెలుస్తోంది. అటు కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం(D)లోకి తిరిగి చేర్చడంపై NOV 7న క్లారిటీ రానుంది.


