News April 5, 2025
అంటరానితనం నిర్మూలనకు జగ్జీవన్ రామ్ కృషి: కలెక్టర్

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త బస్సు స్టాండ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అదనపు కలెక్టర్ పి.రాంబాబు, జిల్లా ఎస్పీ నరసింహతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటరానితనమన్నదే ఉండకూడదని, అంటరానితనం నిర్మూలనకు కృషి చేశారన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ వేణు మాధవ్ ఉన్నారు.
Similar News
News April 7, 2025
బెట్టింగ్.. నలుగురి అరెస్ట్: ADB SP

ADBలో బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SP అఖిల్ మహాజన్ తెలిపారు. మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంనగర్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న రియాజ్, పిట్టలవాడకు గంథాడే సోహన్ IPL బెట్టింగ్ నిర్వహిస్తుండగా వారిని పట్టుకొని కేసు నమోదు చేశారు. వన్ టౌన్ పరిధిలో సుల్తాన్, ఒక మైనర్ సెల్ఫోన్లో ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడగా వారిపై కేసు నమోదు చేశారు. నగదు స్వాధీనం చేసుకున్నారు.
News April 7, 2025
MNCL:GOOD NEWS.. 7 నుంచి కంటి పరీక్షలు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7వ తేదీ నుంచి అంగన్వాడీ కేంద్రాల్లో ఆరేళ్ల లోపుచిన్నారులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లావైద్యారోగ్యశాఖ అధికారి డా.హరీశ్ రాజ్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా 8 ఆర్బీఎస్కే బృందాలతో 37, 920 మంది పిల్లలకు కంటి పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వెల్లడించారు.
News April 7, 2025
నిర్మల్: మానవత్వం చాటుకున్న RTC కండక్టర్

ఆర్టీసీ బస్సులో దొరికిన పర్సును అందజేసి నిజాయితీని చాటుకున్నాడు కండక్టర్ నారాయణ. ఆదివారం నిర్మల్ నుంచి భైంసా వెళ్లే ఆర్టీసీ బస్సులో రాంపూర్ వరకు ప్రయాణించిన ఓ మహిళ బస్సులోనే పర్సును మరిచిపోయారు. పర్సులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా ఆమెని పిలిపించి రూ.10 వేల నగదు, పర్సును అందజేశారు. డిపో మేనేజర్ పండరి, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్ పలువురు ఆయనను అభినందించారు.