News April 17, 2024
అండర్-14 బాలుర క్రికెట్ విజేత ఇచ్ఛాపురం
ఆల్ ఇండియా అండర్-14 బాలుర క్రికెట్ టోర్నమెంట్లో ఇచ్ఛాపురం క్రికెట్ క్లబ్ (ఆంధ్ర ప్రదేశ్) విజేతగా నిలిచింది. ఒడిశా రాష్ట్రం కుర్దాలో జరిగిన టోర్నమెంట్లో ఛత్తీస్గడ్, ఝార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, దిల్లీ, బీహార్, తమిళనాడు తరఫున జట్లు పాల్గొన్నాయి. ఇచ్ఛాపురం క్రికెట్ క్లబ్ (ఐసీసీ) ఫైనల్లో ఝార్ఖండ్ పై గెలిచి విజేతగా నిలిచినట్లు కోచ్ గోపి తెలిపారు.
Similar News
News September 30, 2024
జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి
జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.
News September 30, 2024
జాతీయస్థాయి హాకీ శిక్షకుడిగా సిక్కోలు వాసి
జాతీయ స్థాయి హాకీ పోటీల్లో పాల్గొననున్న రాష్ట్ర మహిళల జట్టు కోచ్గా శ్రీకాకుళం జిల్లాకు చెందిన అల్లు అనిల్ కుమార్ను నియమించినట్లు ఏపీ హాకీ సంఘ అధ్యక్షుడు బి.ఎం. చాణక్యరాజు ఆదివారం తెలిపారు. రాష్ట్రానికి హకీ క్రీడలో మంచి పేరు తీసుకురావాలని కోరారు. జిల్లా వాసికి అరుదైన గౌరవం దక్కిందని జిల్లా హాకీ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు అప్పలనాయుడు, రమేశ్ అభినందించారు.
News September 30, 2024
అరసవెల్లి ఆలయంలో సూర్యకిరణ దర్శనం
అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో ఉత్తరాయణ, దక్షిణాయణ కాలమార్పుల్లో భాగంగా తొలి సూర్యకిరణాలు నేరుగా మూలవిరాట్టును తాకనున్నాయి. ఆ అరుదైన క్షణాలు అక్టోబర్ 1, 2 తేదీల్లో సాక్షాత్కరించనున్నాయని EO భద్రాజీ ఆదివారం తెలిపారు. సూర్యోదయ సమయంలో నేరుగా సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామి వారి మూలవిరాట్టును తాకడం ఇక్కడి క్షేత్ర మహత్యంగా చెబుతుంటారు. భక్తులు దర్శించుకోవాలని కోరారు.