News February 9, 2025
అంబాజీపేటలో తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు

అంబాజీపేట మండలం ఇసుకపూడికి చెందిన పమ్మి వెంకటేశ్శరరావు గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యానికి గురైయ్యారు. కూతురు పద్మ అన్నీ తానై తండ్రికి ఎన్నో సపర్యలు చేసింది. ఆదివారం పరిస్థితి విషమించడంతో వెంకటేశ్వరరావు తుది శ్వాస విడిచారు. కొడుకు స్థానంలో తలకొరివి పెట్టింది. గతంలో తన తల్లికి ఆరోగ్యం సరిగా లేని సమయంలో కూడా తల్లికి అన్ని కార్యక్రమాలు కూతురే నిర్వహించిందని బంధువులు తెలిపారు.
Similar News
News December 15, 2025
IPLలో అదుర్స్.. T20Iల్లో చెత్త ప్రదర్శన

భారత ప్లేయర్లు సూర్య కుమార్, గిల్ ప్రదర్శన T20Iల్లో ఆందోళన కలిగిస్తోంది. IPL-2025లో సత్తా చాటిన ఈ ప్లేయర్లు, దేశం తరఫున పేలవ ప్రదర్శన చేస్తున్నారు. IPLలో సూర్య 65.18 సగటుతో 717 రన్స్, గిల్ 50 యావరేజ్తో 650 పరుగులు చేశారు. అయితే ఇండియా తరఫున మాత్రం స్కై 14.20 సగటుతో 213, గిల్ 24.25 సగటుతో 291 పరుగులే చేశారు. దీంతో ఈ ప్లేయర్ల స్థానంలో ఇతర ఆటగాళ్లకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
News December 15, 2025
హత్యాచార దోషికి క్షమాభిక్షను తిరస్కరించిన రాష్ట్రపతి

MHలో రెండేళ్ల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి క్షమాభిక్షను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తిరస్కరించారు. చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన కేసులో రవి అశోక్కు 2019లోనే సుప్రీంకోర్టు మరణశిక్ష విధించింది. అతనికి శారీరక కోరికలపై కంట్రోల్ లేదని, లైంగిక వాంఛను తీర్చుకునేందుకు అన్ని పరిమితులను ఉల్లంఘించారని తీర్పునిచ్చింది. ముర్ము బాధ్యతలు స్వీకరించాక 3 సార్లు క్షమాభిక్షను తిరస్కరించారు.
News December 15, 2025
సిద్దిపేటలో బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం

సిద్దిపేట నియోజకవర్గంలో మొత్తం 91 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. బీఆర్ఎస్ 78 సీట్లు కైవసం చేసుకోగా అధికార కాంగ్రెస్ 5 పంచాయతీ స్థానాలు వెల్కటూర్, బూరుగుపల్లి, రాంపూర్, నాగరాజు పల్లి, బచ్చాయిపల్లిలో గెలిచింది. బీజేపీ 2 పంచాయతీ స్థానాలు చందలా పూర్, నాంచారుపల్లి గెలవగా ఇండిపెండెంట్ -6 తడకపల్లి, అల్లీపూర్, కోదండరావుపల్లి, సిద్దన్నపేట, ఖానాపూర్, రాజ్ గోపాల్ పేట్ గెలుపొందారు.


