News April 19, 2025
అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యం: మంత్రి

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రాష్ట్ర విపత్తు స్పందన&అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ట్రెండ్ సెట్ మాల్లో శుక్రవారం మాక్ డ్రిల్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర హోమ్ మంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. రాష్ట్రాన్ని అగ్ని ప్రమాద రహితంగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా అగ్నిప్రమాలు జరిగేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సిబ్బంది లైవ్లో చేసి చూపించారు.
Similar News
News April 20, 2025
నెల్లిమర్ల ఛైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం..?

నెల్లిమర్ల నగర పంచాయతీ ఛైర్పర్సన్ బంగారు సరోజినీపై అవిశ్వాస తీర్మానం పెట్టనున్నట్లు జోరుగా చర్చ సాగుతుంది. ప్రస్తుతం ఈమె జనసేనలో ఉన్నారు. ఈ విషయమై ఇప్పటికే కౌన్సిలర్లు చర్చించినట్లు సమాచారం. పొత్తులో ఉన్న TDP, జనసేన సఖ్యత లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. మొత్తం 20 వార్డుల్లో TDPకి 7, YCPకి 9, BJPకి 1, జనసేనకు 3 చొప్పున సభ్యుల బలం ఉంది. సభ్యులు సహకరిస్తే TDPకి ఛైర్మన్ దక్కే అవకాశం ఉంది.
News April 20, 2025
AMP: జిల్లాలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు

కోనసీమ జిల్లాలో ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించనున్నామని డీఈవో షేక్ సలీం భాష తెలిపారు. ఆయన అమలాపురం నుంచి శనివారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రైవేట్, అన్ ఎయిడెడ్ పాఠశాలలలో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించేందుకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆసక్తి కలిగిన వారు 26వ తేదీలోపు వెబ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.
News April 20, 2025
చంద్రబాబుకు YS జగన్ బర్త్డే విషెస్

AP: ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాజీ CM వైఎస్ జగన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు. మీరు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన, దీర్ఘాయుష్షుతో జీవించాలని కోరుకుంటున్నాను’ అని Xలో పోస్ట్ చేశారు. అటు కేంద్రమంత్రులు, మంత్రులు చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతున్నారు.