News June 24, 2024
అగ్నివీరులుగా నల్గొండ NG కాలేజీ స్టూడెంట్స్
నల్గొండ NG కాలేజీ స్టూడెంట్స్ సత్తాచాటుతున్నారు . డిగ్రీ స్థాయిలోనే అగ్నిపథ్కు ఎంపికై నాలుగేళ్ల పాటు సైన్యంలో పనిచేసే అవకాశాన్ని పొందుతున్నారు. ఎన్సీసీ విద్యార్థులు ఉమేష్, చరణ్, మహేష్, కార్తీక్, కళ్యాణ్ లాజర్, ఎం.మహేష్ గతేడాది OCTలో అగ్నిపథ్కు ఎంపికయ్యారు. ఏడు నెలల పాటు తమిళనాడులో శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇటీవల వీరు జమ్మూకశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, ఢిల్లీలో సైనికులుగా బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News October 8, 2024
యాదాద్రి: రూ.10,65,000తో అమ్మవారి అలంకరణ
ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. చౌటుప్పల్ మండలం జైకేసారంలో అమ్మవారిని రూ.10,65,000తో అలంకరించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి గ్రామ భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
News October 8, 2024
NLG: లైంగిక దాడి ఘటనలో నిందితుడి అరెస్టు
మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిని చండూరు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వాటుపల్లి బాబీ (24) కొన్ని రోజుల క్రితం తాపీ పనులు చేసేందుకు మండలంలోని ఓ గ్రామానికి వచ్చి అక్కడే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఓ బాలికకు చాక్లెట్లు కొనిస్తానని చెప్పి బయటకు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు సీఐ వెంకటయ్య తెలిపారు.
News October 8, 2024
నల్లగొండలో రేపు జాబ్ మేళా
నల్లగొండలోని ఉపాధి కల్పన కార్యాలయంలో ఈ నెల 9న ఉదయం 10.30 నుంచి 2 గంటల వరకు నిరుద్యోగ యువతీ, యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో విదేశీ ఉద్యోగాల కోసం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనాలు ఉంటాయని పేర్కొన్నారు.