News June 21, 2024
అద్దంకి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అద్దంకి మండలం వెంకటాపురం జాతీయ రహదారి వద్ద శుక్రవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రేణింగవరం వైపు సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొనడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అతను మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 5, 2024
ప్రకాశం: ‘ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేపట్టండి’
ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు సవరణలకు సంబంధించి సెప్టెంబరు నెలాఖరు వరకు వచ్చిన దరఖాస్తులను రెండు రోజులలోగా పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అధికారి ఆర్.శ్రీలత సంబంధిత అధికారులకు చెప్పారు. ఈ నెల 29వ తేదీన ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించాల్సి ఉన్న నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల ఈఆర్వోలు, ఏఈఆర్వోలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో తన ఛాంబరులో ఆమె సమీక్ష నిర్వహించారు.
News October 4, 2024
జె. పంగులూరు: నీటి కుంటలో పడి అన్నదమ్ములు మృతి
బాపట్ల జిల్లా జె. పంగులూరు మండలం బోదవాడలో ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి చిన్నారులు మృతి చెందిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. దసరా సెలవులకు తాత గారి ఊరు వచ్చిన చిన్నారులు సాయంత్రం ఆడుకుంటూ ఇంటి వెనక ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో కందుల బ్రహ్మారెడ్డి (8), కందుల సిద్ధార్థ రెడ్డి (6) మృతి చెందారు. పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
News October 4, 2024
ప్రకాశం: బైక్ టైర్లో చున్నీ ఇరుక్కుని.. మహిళ మృతి
సంతమాగులూరు మండలం ఏల్చూరులోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్ వెనుక టైర్లో చున్నీ చుట్టుకోవడంతో రోడ్డు మీదపడి బల్లికువ మండలం కొప్పెరపాడుకు చెందిన మహిళా అక్కడకక్కడే మృతి చెందింది. నరసరావుపేట నుంచి కొప్పెరపాడు వైపు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.