News June 30, 2024

అనంత: రూ.11 లక్షలతో ఉడాయించిన ఆర్బీకే అధికారి

image

కుందుర్పి మండలం జంబుగుంపుల రైతు భరోసా కేంద్రం విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ (వీహెచ్ఏ) ప్రవీణ్ రూ.11 లక్షల నగదుతో 10 రోజుల క్రితం ఉడాయించాడు. ఈ ఘటనపై మండల వ్యవసాయ అధికారి మహేశ్ ఆదివారం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాయితీ విత్తనాలు విక్రయించగా రూ.17 లక్షలు వచ్చాయని, అందులో ప్రవీణ్ రూ.11 లక్షలు తీసుకొని పరారయ్యాడని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News September 19, 2024

ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాట్లు: కలెక్టర్

image

శ్రీ సత్యసాయి జిల్లాలోని ఇసుక పాయింట్ల వద్ద నుంచి ఉచిత ఇసుకను పారదర్శకంగా అందించేందుకు ఏర్పాటు చేసినట్టు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. కలెక్టర్ కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన అధికారులతో మాట్లాడారు. ఉచిత ఇసుక కోసం ప్రజలు ఆన్లైన్లో సులభతరంగా నమోదు చేసుకుని ప్రక్రియను క్రమబద్ధమైన రీతిలో రూపొందించామన్నారు.

News September 19, 2024

రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్ల అరెస్టు: ఎస్పీ

image

ధర్మవరంలో ముంబై పోలీసులమని చెప్పి సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి నుంచి రూ.33 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసినట్లు ఎస్పీ రత్న తెలిపారు. ధర్మవరం ఒకటో పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడించారు. నరేశ్ గోయల్ అనే వ్యక్తి రూ.500 కోట్లు బ్యాంక్‌లో రుణం తీసుకుని మీ ఖాతాకు రూ.20 లక్షలు మళ్లించారని బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు వెల్లడించారు.

News September 19, 2024

సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభం

image

అనంతపురం కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవనంలో సాగునీటి సలహా మండలి సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆధ్వర్యంలో సాగునీటి సలహా మండలి సమావేశం జరగగా సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ వినోద్ కుమార్, ఎస్పీ జగదీశ్, జడ్పీ ఛైర్ పర్సన్ బోయ గిరిజమ్మ, అనంతపురం, రాయదుర్గం, గుంతకల్లు, కళ్యాణదుర్గం, శింగనమల, తాడిపత్రి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.