News October 12, 2024

అనంత: విద్యుత్ షాక్‌కు గురై బాలుడి మృతి

image

విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందిన ఘటన డీ.హీరేహల్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. హీరేహల్‌కు చెందిన ఎర్రిస్వామి అనే బాలుడు గొర్రెలు మేపడానికి ఇంటి నుంచి వెళ్లారు. అయితే విద్యుత్ ట్రాన్స్‌ఫారం వద్ద స్టే వైరు తగిలి విద్యుత్ షాక్‌కు గురయ్యారు. వెంటనే బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News October 13, 2024

అనంత జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతి వేడుకలు: మంత్రి లోకేశ్

image

అనంతపురం జిల్లాలో రాష్ట్రస్థాయి వాల్మీకి జయంతిని నిర్వహిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. టీడీపీ బీసీల పుట్టినిల్లు అన్నారు. వారి ఆత్మ గౌరవాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన మరో హామీని చంద్రబాబు నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం నెరవేరుస్తుందని అన్నారు. ఈనెల 17న అధికారికంగా అన్ని జిల్లా కేంద్రాలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేశారు.

News October 13, 2024

చిలమత్తూరు: గ్యాంగ్ రేప్ చేసింది వాళ్లేనా..?

image

శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలో అత్త, కోడలిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కీలక విషయాలు రాబట్టినట్లు సమాచారం. హిందూపూర్‌కు చెందిన నలుగురిని అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని తెలుస్తోంది. నిందితులంతా చిల్లర దొంగలని సమాచారం.

News October 13, 2024

గ్యాంగ్ రేప్‌ బాధాకరం: పయ్యావుల

image

బళ్లారి నుంచి ఉపాధి కోసం వచ్చి చిలమత్తూరు మండలం నల్లబొమ్మినిపల్లిలో అత్తా కోడలిపై అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్పందించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. పొట్టకూటి కోసం వచ్చిన అత్తా కోడలిపై గ్యాంగ్ రేప్ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఇది అత్యంత బాధాకరమని చెప్పారు.