News March 1, 2025
అనకాపల్లి: 89.46 శాతం పింఛన్లు పంపిణీ

అనకాపల్లి జిల్లాలో మధ్యాహ్నం 12.10 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పథకం కింద 89.46 శాతం పింఛన్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. సబ్బవరం మండలంలో 95.40 శాతం, కె.కోటపాడు మండలంలో 93.82 మునగపాక మండలంలో 93.05, దేవరాపల్లిలో 92.93, ఎలమంచిలి మున్సిపాలిటీలో 92.72 పింఛన్లను పంపిణీ చేసినట్లు తెలిపారు. అలాగే కసింకోట మండలంలో 92.36, చోడవరం మండలంలో 92.3, పరవాడలో 91.94 శాతం పింఛన్లను పంపిణీ చేశారు.
Similar News
News March 1, 2025
కర్నూలు జిల్లా నేటి ముఖ్యాంశాలు

➤ మంత్రాలయ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న నారా లోకేశ్➤ ఇంటర్ పరీక్షలు.. తొలిరోజు 611 మంది విద్యార్థుల గైర్హాజరు➤ మెగా డీఎస్సీ నోటిఫికేషన్ తక్షణమే ఇవ్వాలని లోకేష్కు వినతి ➤ కడిమెట్లలో జిల్లా కలెక్టర్ పర్యటన➤ రాయలసీమలో వలసలు నివారించడమే లక్ష్యం: లోకేశ్ ➤ ఆదోని: వైసీపీని వీడిన 75 కుటుంబాలు➤ లోకేష్ పర్యటనలో ఆసక్తికర ఘటన
News March 1, 2025
విశాఖ: సోదరి ఇంటికి వెళ్తూ ప్రమాదంలో మహిళ మృతి

విశాఖ సెంట్రల్ జైల్ సమీపంలో ఎస్ఎస్ఎ నగర్ ఎదురుగా బిఆర్ఎస్ రోడ్డులో స్కార్పియో వాహనం ఢీకొని గెడ్డం సావిత్రి(62) అనే మహిళ మృత్యువాత పడినట్లు ఆరిలోవ ట్రాఫిక్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు. రోడ్డు దాటుతుండగా సెంటర్ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. మృతురాలు ఆనందపురం గ్రామం కాగా స్థానికంగా ఉన్న సోదరి ఇంటికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడినట్లు తెలిపారు.
News March 1, 2025
నిర్మల్: బైక్ను ఢీకొన్న లారీ.. వ్యక్తికి గాయాలు

నిర్మల్లోని శివాజీ చౌక్ వద్ద సిగ్నల్ పడడంతో ఆగి ఉన్న బైక్ను లారీ ఢీకొంది. దీంతో బైక్ పై వెళ్తున్న వసంతరావు తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. పట్టణానికి చెందిన వసంతరావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.