News March 16, 2025

అనకాపల్లి: జిల్లాలో పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 17 నుంచి జరిగే పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈవో అప్పారావు నాయుడు తెలిపారు. జిల్లాలో 107 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 22,042 మంది పరీక్షలకు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. వీరిలో బాలికలు 10,968 మంది, బాలురు 11,074 మంది ఉన్నట్లు తెలిపారు. 31 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. రోజు ఉదయం 9:30 గంటలకు పరీక్ష ప్రారంభం అవుతుందన్నారు.

Similar News

News March 16, 2025

విశాఖ జిల్లా పి.టి.ఐ.లు ప్రాంతీయ సదస్సు

image

సమగ్ర శిక్షాలో 2012 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పి.టి.ఐ.లను రెగ్యులరైజ్ చేయాలని విశాఖ పౌర గ్రంథాలయంలో ఆదివారం ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా 5,800 మంది, ఉమ్మడి విశాఖలో 460 మందికి పైగా ఈ విధుల్లో ఉన్నారన్నారు. తక్షణమే వారిని రెగ్యులరైజేషన్ చేసి, బోధనేతర పనుల భారం తగ్గించాలని,ఇ.ఎస్.ఐ., ఇ.పి.ఎఫ్ వర్తింపజేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

News March 16, 2025

సునీతా విలియమ్స్ జీతం ఎంతంటే?

image

భారత సంతతికి చెందిన NASA వ్యోమగామి సునీతా విలియమ్స్ కొద్ది రోజుల్లో భూమి మీదకు చేరుకోనున్నారు. ఈ క్రమంలో ఆమె జీతం గురించి నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. ఆమె జీతం, ఆహారం, బస ఖర్చులను నాసానే భరిస్తుంది. ఆమె వార్షిక వేతనం సుమారు రూ.1.08 కోట్ల నుంచి రూ.1.41 కోట్లు ఉంటుందని తెలుస్తోంది. అలాగే స్పేస్‌లో అదనంగా ఉంటే రోజుకు రూ.347 (4 డాలర్లు) మాత్రమే ఇస్తుందని సమాచారం.

News March 16, 2025

భారత త్రో బాల్ జట్టుకు ఎంపికైన వెన్నపూస రోషీ రెడ్డి

image

భారత త్రో బాల్ జట్టుకు అనంతపురానికి చెందిన వెన్నుపూస రోషీ రెడ్డి ఎంపికయ్యారు. భారత పారా త్రో బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆల్బర్ట్ ప్రేమ్ కుమార్ ఎంపికైన లేఖను పంపించినట్లు రోషీ రెడ్డి తెలిపారు. అనంతపురం జిల్లా దివ్యాంగుల క్రికెట్ సంఘం అధ్యక్షులు డాక్టర్ శంకర్ నారాయణ అతడిని అభినందించారు. కంబోడియాలో జరిగే ఆసియా పారా త్రోబాల్ టోర్నమెంట్లో భారత జట్టు తరపున ఆడనున్నారు.

error: Content is protected !!