News March 17, 2025

అనకాపల్లి జిల్లాలో ప్రమాదాలు జరగకుండా చర్యలు: ఎస్పీ

image

అనకాపల్లి జిల్లా పోలీసులు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సూచించారు. సోమవారం ఆయన సమావేశంలో మాట్లాడుతూ.. లారీ డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా లారీ యజమానులు, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి రవాణా నిబంధనలు, రహదారి భద్రతా నియమాలు గురించి అవగాహన కల్పించాలని అధికారులు కు సూచించారు.

Similar News

News March 18, 2025

అనకాపల్లి: 23న ప్లాంట్ పరీక్ష నిర్వహణ

image

అనకాపల్లి జిల్లాలో ఈనెల 23న జరిగే ఫౌండేషన్ లిటరసీ, న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (ప్లాంట్) ను నిర్వహించాలని అధికారులను కలెక్టర్ విజయ కృష్ణన్ ఆదేశించారు. ప్లాంట్ పరీక్ష నిర్వహణపై సోమవారం అధికారులతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఉల్లాస్ అక్షరాస్యత కార్యక్రమంలో 1,190 మందిని అక్షరాస్యులుగా మార్చినట్లు తెలిపారు. వారికి 23న అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలో ప్లాంట్ పరీక్ష నిర్వహించాలన్నారు.

News March 18, 2025

దిల్‌సుఖ్‌నగర్‌లో యువతులతో వ్యభిచారం.. ARREST

image

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న నాగమణి అనే మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్‌సుఖ్‌‌నగర్‌లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.

News March 18, 2025

తెలంగాణ ప్రభుత్వానికి బాంబే హైకోర్టు నోటీసులు

image

అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరమని, వాటిని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించినా అది వాణిజ్య దోపిడీ కిందికే వస్తుందని బాంబే హైకోర్టు పేర్కొంది. అంగీకారం లేకుండా మహిళల ఫొటోలు ప్రకటనల్లో వాడుతున్నారనే నమ్రత అంకుశ్ అనే మహిళ పిటిషన్‌పై కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. దీనిపై ఈ నెల 24లోగా సమాధానం చెప్పాలని కేంద్రం, తెలంగాణ, MH, కర్ణాటక, ఒడిశా ప్రభుత్వాలు, కాంగ్రెస్ పార్టీ ఇతరులకు ఆదేశాలిచ్చింది.

error: Content is protected !!