News March 22, 2025
అనకాపల్లి జిల్లాలో వడగాల్పులు

జిల్లాలో పలు చోట్ల గరిష్టంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని APSDMA తెలిపింది. జిల్లాలో శుక్రవారం నాతవరంలో 40.2 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. శనివారం జిల్లాలోని పలు మండలాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండల దెబ్బకు వడదెబ్బలు తగిలే అవకాశం ఉందని తెలిపింది. అటు వైద్య శాఖ సైతం పలు సూచనలు చేసింది.
Similar News
News December 14, 2025
సిద్దిపేట: వెబ్ క్యాస్టింగ్ ద్వారా ఎన్నికల ఓటింగ్ పరిశీలన

జిల్లాలో నేడు 10 మండలాల్లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియలో క్రిటికల్ పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ ద్వారా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హైమావతి వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఆయా ఎంపీడీఓలకు పలు సూచనలు చేశారు. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు వెబ్ కాస్టింగ్ను మానిటర్ చేయాలన్నారు.
News December 14, 2025
సంజయ్ గాంధీ మెమోరియల్ హాస్పిటల్లో ఉద్యోగాలు

ఢిల్లీలోని <
News December 14, 2025
నల్గొండలో ప్రశాంతంగా పోలింగ్: ఎస్పీ

నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందని ఎస్పీ శరత్ చంద్ర పవార్
తెలిపారు. ఆయన జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును పర్యవేక్షించారు. ఎన్నికల నేపథ్యంలో జిల్లా అంతటా 144 సెక్షన్ (163 బీఎన్ఎస్ఎస్) అమలులో ఉన్నట్లు స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమిగూడకూడదన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


