News April 3, 2025
అనకాపల్లి: ప్రభుత్వానికి 30.46 ఎకరాల భూమి అప్పగింత

ప్రభుత్వ భూముల్ని కాజేస్తున్న ఈరోజుల్లో సర్కారుకే తిరిగి భూముల్ని అప్పగించిన ఘటన అనకాపల్లి జిల్లా బుచ్చియ్యపేట(M) చిన భీమవరంలో చోటుచేసుకుంది. కూర్మన్నపాలేనికి చెందిన వ్యాపారవేత్త కడియాల రాజేశ్వరరావు గతంలో 30.46 ఎకరాల డిపట్టా భూములను కొనుగోలు చేశారు. గురువారం కలెక్టర్ విజయ్ కృష్ణన్ను కలిసి ఆ భూములపై సర్వహక్కులను వదులుకుంటున్నట్లు తెలిపారు. మార్కెట్ విలువ ప్రకారం ఆ భూముల విలువ సుమారు రూ.8కోట్లపైనే.
Similar News
News April 11, 2025
నేడే జాబ్ మేళా.. సద్వినియోగం చేసుకోండి: మంత్రి కొండా

వరంగల్ జిల్లా నిరుద్యోగ యువతీ, యువకులకు టాస్క్ వారి సౌజన్యంతో నేడు జాబ్ మేళా జరగనుంది. వరంగల్ జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కొండా సురేఖ సూచించారు. శుక్రవారం ఉదయం 9:30 నుంచి వరంగల్లోని ఎంకే నాయుడు హోటల్స్, కన్వెన్షన్లో ప్రారంభం అవుతుందని మంత్రి గుర్తు చేశారు.
News April 11, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 11, 2025
ఏప్రిల్ 11: చరిత్రలో ఈరోజు

1827: సంఘ సంస్కర్త జ్యోతిరావు ఫూలే జననం (ఎడమ ఫొటో)
1869: కస్తూరిబాయి గాంధీ జననం (కుడి ఫొటో)
1904: నటుడు, గాయకుడు కుందన్ లాల్ జననం
1919: అంతర్జాతీయ కార్మిక సంస్థ ఏర్పాటు
2010: నక్సలైట్ ఉద్యమకారుడు పైలా వాసుదేవరావు మరణం
* ప్రపంచ పార్కిన్సన్స్ దినోత్సవం * జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవం