News March 11, 2025
అనకాపల్లి: బాలికపై అత్యాచారం.. 25 ఏళ్ల జైలు శిక్ష

అనకాపల్లికి చెందిన మూడున్నర ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి పోక్సో కోర్టు జడ్జి కే.నాగమణి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చినట్లు విజయనగరం ఎస్పీ వకుల్ జిందాల్ సోమవారం తెలిపారు. అనకాపల్లికి చెందిన ఓ కుటుంబం గతేడాది విజయనగరం జిల్లా కొఠారుబిల్లిలో వివాహానికి హాజరైంది. నిందితుడు వి.రవి ఆ కుటుంబానికి చెందిన బాలికను పక్కకు తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Similar News
News March 12, 2025
శ్రీగిరిపై 27 నుంచి ఉగాది మహోత్సవాలు

శ్రీశైల క్షేత్రంలో ఈ నెల 27 నుంచి 31వ తేదీ వరకు ఉగాది మహోత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఐదు రోజులు పాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రానున్నారు. ఉత్సవాల ప్రారంభానికి ముందే నుంచే భక్తుల రద్దీ అధికంగా ఉండే నేపథ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
News March 12, 2025
KMR: బడ్జెట్ సమావేశాలు.. ఈ పనులపై గళం విప్పాలి!

అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కామారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్యేలు గళం విప్పి పలు పనులకు సంబంధించి నిధులు తెస్తారని ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. నాగమడుగు ఎత్తిపోతల పథకం పనులు నత్త నడకన సాగుతున్నాయి. మహారాష్ట్ర, కామారెడ్డి జిల్లాకు సరిహద్దులో ఉన్న లెండి ప్రాజెక్టు నిధుల గ్రహణం వీడడం లేదు. కాళేశ్వరం ప్యాకేజీ 22కు నిధుల గండం. ఏం చేస్తారో చూడాలి మరి..!
News March 12, 2025
భువనగిరి జిల్లాలో 85 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాచారం

యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణం జరిగింది. పోచంపల్లి మండలంలోని ఓ గ్రామంలో 85 ఏళ్ల వృద్ధురాలిపై ఇద్దరు యువకులు ఆదివారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డారు. సోమవారం వృద్ధురాలి గదిలోకి వెళ్లిన కోడలికి వృద్ధురాలు వివస్త్రగా కనిపించింది. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.