News February 3, 2025
అనకాపల్లి: మత్స్యకారులకు అందని భృతి
చేపల వేట నిషేధానికి సంబంధించి అనకాపల్లి జిల్లాలో మత్స్యకారులకు వేట నిషేధ భృతి ఇప్పటివరకు అందలేదు. ప్రతి ఏటా మాదిరిగా గత ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ వరకు చేపల వేటను ప్రభుత్వం నిషేధించింది. జిల్లాలో 27 మత్స్యకార గ్రామాల్లో 2,168 మంది మత్స్యకారులకు ప్రభుత్వం రూ.2.16 కోట్లు చెల్లించాల్సి ఉంది. గత ఏడాది ఎన్నికల కోడ్ అమలులో ఉండడంతో పరిహారం చెల్లించడానికి అవకాశం లేకుండా పోయింది.
Similar News
News February 3, 2025
పెద్దగట్టులో భారీ బందోబస్తు
పెద్దగట్టు జాతరను పురస్కరించుకొని నిర్వహించిన దిష్టి పూజలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ పర్యవేక్షణలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు డీఎస్పీ రవి సిబ్బందికి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇద్దరు సీఐలు, 11 మంది ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతర ముగిసే వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామన్నారు.
News February 3, 2025
HYD: అబద్ధాలు చెప్పిన KCR: కోదండరాం రెడ్డి
కాళేశ్వరం కట్టతో పాటు అది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ KCR అవాస్తవాలు కూడా నిర్మించారని MLC కోదండరాం రెడ్డి ఆరోపించారు. HYD సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని TG మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. KCR అబద్ధాలు చెప్పారని, కాళేశ్వరంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.
News February 3, 2025
HYD: అబద్ధాలు చెప్పిన KCR: కోదండరాం రెడ్డి
కాళేశ్వరం కట్టతో పాటు అది ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అంటూ KCR అవాస్తవాలు కూడా నిర్మించారని MLC కోదండరాం రెడ్డి ఆరోపించారు. HYD సోమాజిగూడ ప్రెస్క్లబ్లో సీనియర్ జర్నలిస్ట్ రేమిల్ల అవధాని రచించిన ‘కాళేశ్వరం ఫియాస్కో: ఎ టేల్ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్స్’ పుస్తకాన్ని TG మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన ఆవిష్కరించారు. KCR అబద్ధాలు చెప్పారని, కాళేశ్వరంతో అనేక సమస్యలు వస్తున్నాయన్నారు.