News March 4, 2025

అనుమానంతో భార్యపై కత్తితో దాడి చేసిన భర్త

image

పాల్వంచ వర్తక సంఘ భవనం పక్కన రేగా లక్ష్మి-రవీందర్ దంపతులు గతేడాది నుంచి నివాసముంటున్నారు. భార్యపై అనుమానంతో గత కొంతకాలంగా గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఇరువురి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంలో భార్యపై భర్త కత్తితో దాడి చేశాడు. స్థానికులు వెంటనే పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కొత్తగూడెం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 4, 2025

హనుమకొండ: DANGER ప్లేస్.. మరో వ్యక్తి మృతి

image

హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం.

News March 4, 2025

హనుమకొండ: DANGER ప్లేస్.. మరో వ్యక్తి మృతి 

image

హసన్‌పర్తి మండలం కోమటిపల్లిలోని నిరూప్ నగర్ తండా సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద ఉనికిచర్ల ప్రధాన రహదారిపై ఈరోజు యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కాజీపేట మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన కడుగుల రవి(60) బైక్‌పై హనుమకొండ వెళ్తుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి కింద పడ్డాడు. దీంతో తీవ్రగాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. కాగా గత ఆరు నెలల్లోనే సేమ్ ప్లేస్‌లో ఐదుగురు చనిపోవడం గమనార్హం. 

News March 4, 2025

విజ‌య‌వాడ‌: ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌ను త‌నిఖీ చేసిన కలెక్టర్ 

image

విజ‌య‌వాడ‌లోని బిష‌ప్ అజ‌ర‌య్య జూనియ‌ర్ క‌ళాశాల‌, శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర సిద్ధార్థ మ‌హిళా క‌ళాశాలలోని ఇంట‌ర్ ప‌రీక్షా కేంద్రాల‌్లో మంగ‌ళ‌వారం క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ త‌నిఖీ చేశారు. అనంతరం విద్యార్థులు ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ప‌రీక్ష‌లు రాసేందుకు చేసిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. వేస‌వి నేప‌థ్యంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాల‌ని కలెక్టర్ సిబ్బందిని ఆదేశించారు. ఆయన పలువురు అధికారులు ఉన్నారు. 

error: Content is protected !!