News April 7, 2025
అన్నమయ్య: డిప్యూటీ కలెక్టర్ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం

సంబేపల్లె మండలం, యర్రగుంట్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో హంద్రీనీవా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుగాలి రమాదేవి మృతిచెందడంపై సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు నారా చంద్రబాబునాయుడు సూచించారు.
Similar News
News April 19, 2025
ఇది నమ్మశక్యంగా లేదు: రోహిత్ శర్మ

వాంఖడే స్టేడియంలో స్టాండ్కు తన పేరును పెట్టడంపై రోహిత్ శర్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా ఫేవరెట్ రంజీ ప్లేయర్లను చూసేందుకు వాంఖడే బయట ఎదురుచూస్తూ ఉండేవాడిని. స్టేడియంలోకి అందర్నీ రానిచ్చేవారు కాదు. అలాంటిది అదే స్టేడియంలో నా పేరిట స్టాండ్ అంటే చాలా భావోద్వేగంగా ఉంది. నమ్మశక్యంగా లేదు. ఇది ఎంతోమంది క్రికెటర్లకు కల’ అని హర్షం వ్యక్తం చేశారు.
News April 19, 2025
వ్యవసాయంలో నూతన సాంకేతికతను అలవర్చుకోవాలి: రాజనర్సింహ

రైతులందరూ నూతన సాంకేతిక నలబరుచుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారంలో అయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వ్యవసాయాన్ని కాంగ్రెస్ పార్టీ పండగల మార్చిందన్నారు. రాయికోడ్ ప్రాంతానికి లిఫ్టు ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు.
News April 19, 2025
మైనర్ మినరల్ పాలసీ రిలీజ్ చేసిన ప్రభుత్వం

AP: రాష్ట్ర ప్రభుత్వం మైనర్ ఖనిజాల పాలసీ-2025 విడుదల చేసింది. అధిక ఆదాయ సృష్టి, పెట్టుబడుల ఆకర్షణే దీని ప్రధాన లక్ష్యమని వెల్లడించింది. 2022 మార్చి 13 వరకు పెండింగ్లో ఉన్న దరఖాస్తులకే లీజు మంజూరు చేసేందుకు అంగీకారం తెలిపింది. ఇందులో భాగంగా గ్రానైట్, మార్బుల్లాంటి ఖనిజాలున్న భూములను 30ఏళ్ల పాటు లీజుకు ఇవ్వనుంది. మరోవైపు, యాన్యువల్ డెట్ రెంట్ మూడు నెలల్లోగా కట్టాలని మార్గదర్శకాలు జారీ చేసింది.