News October 7, 2024
అన్నమయ్య: పిడుగు పడి ఇద్దరు కూలీలు మృతి
పిడుగు పడి ఇద్దరు వ్యవసాయ కూలీలు మృతి చెందిన ఘటన సోమవారం అన్నమయ్య జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సంబేపల్లి మండలం సోమవరం గ్రామం బావులకాడపల్లి జగనన్న కాలనీ సమీపంలోని వ్యవసాయ పొలంలో, పిడుగు పడి ఇద్దరు మహిళలు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 7, 2024
టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్
కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.
News October 7, 2024
టీడీపీలో చేరిన కమలాపురం పంచాయతీ ఛైర్మన్
కమలాపురం నగర పంచాయతీ ఛైర్మన్ సోమవారం సాయంత్రం టీడీపీ కండువా కప్పుకున్నారు. ఛైర్మన్ మార్పూరు మేరీతోపాటు మరికొందరు కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. వీరికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డిలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కమలాపురం నగర పంచాయతీ అభివృద్ధి కోసమే తను టీడీపీలో చేరుతున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు.
News October 7, 2024
YVU బీటెక్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలు విడుదల
కడప YVU, ప్రొద్దుటూరు YSR ఇంజినీరింగ్ కళాశాల బీటెక్ 2,4 సెమిస్టర్లు, బిటెక్ డిప్లమా 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను వీసీ ప్రొ కె కృష్ణారెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఈశ్వర్ రెడ్డి, ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ జయరాంరెడ్డితో కలిసి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్బంగా వీసీ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ 59.04 శాతం, 4వ సెమిస్టర్ 62.38 శాతం, బీటెక్ డిప్లొమా 79.70 శాతం ఫలితాలు వచ్చాయన్నారు.