News March 7, 2025

అన్నమయ్య: ‘రేపు పాఠశాలలకు సెలవు లేదు’

image

మార్చి నెల రెండవ శనివారం అన్నమయ్య జిల్లాలోని పాఠశాలలకు సెలవు లేదని అన్ని యాజమాన్య పాఠశాలలు విధిగా తరగతులు నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి కే.సుబ్రహ్మణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా సంవత్సరంలో 220 పని దినములు తగ్గకుండా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు డీఈఓ తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో అధిక సెలవులు ఇవ్వడం వల్ల వర్కింగ్ డేస్ సంఖ్య తగ్గిందని పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ ఎంతంటే..?

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లంతకుంటలో 85.35%, హుజురాబాద్‌లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్‌లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది.

News December 17, 2025

సిరిసిల్ల: జిల్లాలో నమోదైన పోలింగ్ శాతం ఎంతంటే..?

image

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటల నుంచి ఒంటిగంట వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు ఇలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపేట మండలంలో 76 శాతం, వీర్నపల్లిలో 81.89 శాతం, ముస్తాబాద్లో 78.37 శాతం, గంభీరావుపేటలో 73.08 శాతం పోలింగ్ నమోదయింది. 1,25,324 మంది ఓటర్లకు గాను 95,736 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తంగా 76.39 శాతం పోలింగ్ నమోదయింది.

News December 17, 2025

ముగిసిన ‘పంచాయతీ’ సమరం.. ఫలితంపై ఉత్కంఠ

image

ఖమ్మం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగిసింది. అభ్యర్థులు ఓటర్ల ప్రసన్నం కోసం మద్యం, మాంసం, బాండ్ పేపర్లతో హామీలిచ్చారు. హోరాహోరీ ప్రచారం తర్వాత పోలింగ్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి ఫలితాలపైనే నెలకొంది. లక్షల్లో ఖర్చు చేసిన అభ్యర్థుల్లో గెలుపుపై గుబులు మొదలైంది. మరికొద్ది గంటల్లో గ్రామరథ సారధులు ఎవరో తేలిపోనుంది. విజయం ఎవరిని వరిస్తుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.