News March 18, 2025
అన్నవరం: మూలవిరాట్ ఫోటో తీసిన వ్యక్తిపై కేసు నమోదు

ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరంలో భద్రతా వైఫల్యం కనిపిస్తోంది. ఆదివారం రాత్రి ఈవో తనిఖీలు చేసినప్పుడు సత్రంలో బీర్ బాటిళ్లు దొరికాయి. కాగా 2023 సెప్టెంబర్లో ఓ యూట్యూబర్ మూలవిరాట్టు వీడియో తీసి అప్లోడ్ చేశాడు. వెంటనే తొలగించాలని ఆ వ్యక్తికి సూచించినా పట్టించుకోలేదు. దీంతో ఈవో వీర్ల సుబ్బారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News March 18, 2025
విజయ్పై అన్నామలై ఫైర్.. సినిమా సెట్స్లో ఎంజాయ్ చేస్తున్నాడంటూ..

తమిళ హీరో, TVK అధినేత విజయ్పై TN BJP చీఫ్ అన్నామలై మండిపడ్డారు. ‘సినిమాల్లో డ్రింక్, స్మోక్ చేసే నీకు మద్యం కుంభకోణం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఇంట్లో నుంచి రాజకీయాలు చేయడం కాదు. గ్రౌండ్ లెవెల్కి వెళ్లి ప్రజల కష్టాలు తెలుసుకోవాలి. సినిమా సెట్స్లో సిగరెట్, మద్యం తాగుతూ హీరోయిన్ల నడుము తాకుతూ రాజకీయ ప్రకటనలు చేస్తున్నాడు. నేను అతనిలా కాదు. క్షేత్ర స్థాయిలో పోరాడుతున్నా’ అని కామెంట్స్ చేశారు.
News March 18, 2025
RTC ఎండీ సజ్జనార్ క్రేజ్ ఇప్పుడు ఇంటన్నేషనల్

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ Say no to betting apps #Tag తర్వాత దేశ, విదేశాల్లో ఫాలోయింగ్ భారీగా పెరిగింది. మీరు చెప్పేది నిజమే సర్ అంటూ లక్షలాది మంది కామెంట్లు పెడుతున్నారు. సజ్జనార్ ఇన్స్టాను 65 లక్షల మంది చూడగా X హ్యాండిల్ను 72 లక్షల మంది చూశారు. విదేశాల్లో మొరాకో, యూఎస్, యూఏఈ, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, కువైట్ దేశాల వాసుల నుంచి ఆయనకు సపోర్ట్ లభిస్తోంది.
News March 18, 2025
జనగామ: టెన్త్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలి: కలెక్టర్

జనగామ జిల్లాలో పదవ తరగతి పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో పింకేశ్ కుమార్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్లతో కలిసి కలెక్టర్ పదవ తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్ అధికారులు, సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు.