News March 10, 2025
అమరవాయిలో వ్యక్తి మృతి

ఈనెల 3న ఓ వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. పోలీసుల వివరాలు.. మల్దకల్ మండలం అమరవాయికి చెందిన నాగరాజు(35) కూరగాయాల వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నారు. వ్యాపారంలో ఇబ్బందులు, ఆర్థిక సమస్యలతో మనస్తాపానికి గురై పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు.
Similar News
News March 10, 2025
గ్రూప్-1 ఫలితాలు విడుదల

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలు విడుదలయ్యాయి. టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం రిజల్ట్స్ రిలీజ్ చేశారు. అభ్యర్థులు అధికారిక <
News March 10, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ పరీక్షకు 351 మంది గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. జిల్లాలో జనరల్, ఒకేషనల్ కలిపి 17,523 మందికి గాను 17,171 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కడా మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని తెలిపారు. కాగా సోమవారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు ఆర్ఐఓ పేర్కొన్నారు.
News March 10, 2025
ప్రజల నుంచి అర్జీలు తీసుకున్న బాపట్ల జేసీ

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో మీకోసం కార్యక్రమం సోమవారం జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలను జిల్లా సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్ తెలుసుకున్నారు. వారి నుంచి అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని బాధితులకు సంయుక్త కలెక్టర్ హామీ ఇచ్చారు.