News April 6, 2025

అమరావతి: వేగంగా గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు  

image

ఏపీ మెడ్‌టెక్‌జోన్ ప్రాంగణంలో గ్లోబల్ మెడ్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఇది మరో ప్రతిష్ఠాత్మక నిర్మాణంగా నిలుస్తోంది. పూర్తిస్థాయిలో నిర్మాణం పూర్తయిన తర్వాత ఇది రాష్ట్రానికి, దేశానికి సాంకేతిక వైద్య పరికరాల రంగంలో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. ఈ నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో అని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

Similar News

News April 7, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో BJP-MIM

image

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోటీకి నామినేషన్ల పరిశీలన ముగిసింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను ఎలక్షన్ కమిషన్ తిరస్కరించింది. కాంగ్రెస్, BRS పార్టీల నుంచి అభ్యర్థులెవరూ పోటీ చేయట్లేదు. దీంతో భాగ్యనగరంలో BJP-MIM రెండు పార్టీలే తలపడనున్నాయి. ఈ నెల 23న ఎన్నికలు జరగనుండగా. 25న ఓట్ల లెక్కింపు ఉండనుంది.

News April 7, 2025

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: అదనపు కలెక్టర్

image

వేసవి కాలం దృష్ట్యా సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్ ఎ.వెంకట్ రెడ్డి సూచించారు. వేసవి కాలంలో సంబంధిత శాఖలు చేయాల్సిన ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో సమన్వయ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో వేసవికాలంలో వడ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేసేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలన్నారు.

News April 7, 2025

వికారాబాద్: ప్రజావాణి ద్వారా సమస్యల పరిష్కారం: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. కలెక్టరేట్‌లోని సమావేశం మందిరంలో అదనపు కలెక్టర్లు లింగయ్య నాయక్, సుదీర్‌లతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. భూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీపీఓ జయసుధ, డీఆర్డీఓ శ్రీనివాస్, డీఓ రేణుకాదేవి, సాంఘీక సంక్షేమ అధికారి మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!