News February 17, 2025

అమలాపురం: ఎమ్మెల్సీ ఎన్నికకు ముమ్మర ఏర్పాట్లు

image

ఉభయ గోదావరి జిల్లాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ గడువు సమీపిస్తోంది. దీంతో జిల్లా యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలైంది. బ్యాలెట్ పత్రాల ముద్రణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణ తదితర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 27న ఉ.8 గంటల నుంచి సా.4 వరకు పోలింగ్ నిర్వహిస్తారు. 6 జిల్లాల్లో 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా 2 వేల మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు.

Similar News

News December 31, 2025

ధర్మపురి: ముక్కోటి ఏకాదశి.. నర్సన్న ఆదాయం ఎంతంటే..?

image

ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళవారం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్తర ద్వార దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆలయానికి టికెట్ల ద్వారా రూ.3,25,974లు, ప్రసాదాల విక్రయాలతో రూ.4,51,200లు, అన్నదానం ద్వారా రూ.75,730ల ఆదాయం లభించింది. మొత్తం ఆదాయం రూ.8,52,904లు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.

News December 31, 2025

నాకేమీ గుర్తు లేదు.. సిట్ విచారణలో ప్రశాంతిరెడ్డి!

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. TDP కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని ఆమె నివాసంలో సిట్ అధికారులు విచారించారు. YCP ప్రభుత్వంలో ఆమె TTD కొనుగోలు కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. కల్తీ గురించి ప్రశ్నించగా.. ‘4నెలలే ఆ పదవిలో ఉన్నా. ఐదేళ్ల కిందట జరిగినవి ఇప్పుడు గుర్తు రావడం లేదు’ అని ఆమె చెప్పినట్లు సమాచారం. చిన్న అప్పన్న తమ దగ్గర PAగా పనిచేయలేదని చెప్పారు.

News December 31, 2025

నాకేమీ గుర్తు లేదు.. సిట్ విచారణలో ప్రశాంతిరెడ్డి!

image

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. TDP కోవూరు MLA వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని నెల్లూరులోని ఆమె నివాసంలో సిట్ అధికారులు విచారించారు. YCP ప్రభుత్వంలో ఆమె TTD కొనుగోలు కమిటీ సభ్యురాలిగా ఉన్నారు. కల్తీ గురించి ప్రశ్నించగా.. ‘4నెలలే ఆ పదవిలో ఉన్నా. ఐదేళ్ల కిందట జరిగినవి ఇప్పుడు గుర్తు రావడం లేదు’ అని ఆమె చెప్పినట్లు సమాచారం. చిన్న అప్పన్న తమ దగ్గర PAగా పనిచేయలేదని చెప్పారు.