News April 21, 2024
అమలాపురం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నేపథ్యం ఇదే..
అమలాపురం పార్లమెంటరీ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా జంగా గౌతమ్ను ఆ పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. కాగా ఆయన ప్రస్తుతం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం తరఫున పి.గన్నవరం అసెంబ్లీకి పోటీ చేశారు. 2014లో అమలాపురం అసెంబ్లీ, 2019లో అమలాపురం పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయినవిల్లి మండలం నేదునూరు పెదపాలెంలో 1970 ఆగస్టులో జన్మించారు.
Similar News
News October 16, 2024
సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహిస్తా: మంత్రి సుభాశ్
తనపై నమ్మకం ఉంచి కృష్ణా జిల్లా ఇంఛార్జ్ మంత్రిగా నియమించినందుకు సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి, మంత్రి లోకేశ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తనపై పెట్టిన బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తానని అన్నారు.
News October 15, 2024
తూ.గో: భారీ వర్షాలు, కంట్రోల్ రూమ్ నంబర్లు..ఇవే
భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ సమస్యలు ఉంటే అధికారులు నిత్యం అందుబాటులో ఉండేలా జిల్లా వ్యాప్తంగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏవైనా కరెంట్ సమస్యలు ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి.
➤రాజమండ్రి సర్కిల్-7382299960
➤కాకినాడ డివిజన్-9493178718
➤పెద్దాపురం డివిజన్-9493178728
➤అమలాపురం డివిజన్-9440904477
➤రామచంద్రపురం డివిజన్-9493178821
News October 14, 2024
మారేడుమిల్లి: పరుగు పరుగున వెళ్లినా ప్రాణాలు దక్కలేదు
మండలంలోని సున్నంపాడు పంచాయతీ పరిధిలోని నూరుపూడికి చెందిన కె.తమ్మిరెడ్డికి తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. రహదారి సరిగ్గా లేకపోవడం, మార్గమధ్యలో పెద్ద కొండ కాలువ ఉండడంతో అంబులెన్స్ రావడానికి అవకాశం లేకపోయింది. దీనితో గ్రామస్థులు తమ్మిరెడ్డిని డోలీ ద్వారా పరుగు పరుగున 8 కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మార్గమధ్యలోనే సున్నంపాడు వద్ద మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.