News March 29, 2025

అమలాపురం: ప్రజలకు జాగ్రత్తగా ఉండాలని కలెక్టర్ సూచనలు

image

ఈ ఏడాది రికార్డు స్థాయిలో వడగాల్పులు ఉంటాయన్న వాతవరణ శాఖ హెచ్చరికలతో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ మహేశ్ కుమార్ ప్రజలకు సూచించారు. వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శుక్రవారం సమీక్షించారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జనసంచారం, భక్తులు ఎక్కువగా ఉండే ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు.

Similar News

News April 2, 2025

సిరిసిల్ల: సర్దార్ పాపన్న పోరాటం మరువలేనిది: కలెక్టర్

image

బహుజనుల కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటం మరువలేనిదని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్లో సర్ధార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయన చేసిన పోరాటం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందని స్పష్టం చేశారు.

News April 2, 2025

అనంతపురం జిల్లాలో HM సస్పెండ్

image

అనంతపురం జిల్లా ఆత్మకూరు ZPHS హెచ్‌ఎం శ్రీనివాస్ ప్రసాద్‌పై పాఠశాల విద్య కడప RJD శామ్యూల్ మంగళవారం సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు ZPHSలో పరీక్ష రాసేందుకు 10th విద్యార్థిని వెళ్లింది. పరీక్ష జరిగే సమయంలో ఆ విద్యార్థిని ప్రశ్నాపత్రం మిస్ అయిందని చెప్పగా.. చీఫ్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆమెను భుజంపై కర్రతో కొట్టారు. దీంతో విద్యార్థిని కాలర్ బౌన్ విరిగగా ఆయనను సస్పెండ్ చేశారు.

News April 2, 2025

HCU భూములపై NGTలో ఫిర్యాదు

image

హైదరాబాద్ HCU భూముల వేలంపాట అంశం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT)కు చేరింది. వేలం పాట అనైతికం అని న్యాయవాది కారుపోతుల రేవంత్ చెన్నైలోని NGTలో ఫిర్యాదు చేశారు. వేలంపాటను అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. నగరానికి కాలుష్యం నుంచి ఉపశమనం కలిగిస్తున్న ఇలాంటి ప్రాంతాలను నాశనం చేయడం సరికాదన్నారు. మరోవైపు ఈ అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.

error: Content is protected !!