News March 31, 2025

అమలాపురం: రేపు యధావిధిగా సోషల్ పరీక్ష: డీఈవో 

image

పదవ తరగతి సోషల్ పరీక్ష మంగళవారం యధావిధిగా జరుగుతుందని అంబేడ్కర్ కోనసీమ డీఈవో సలీం భాషా సోమవారం తెలిపారు. ఒకటవ తేదీ సోమవారం ప్రభుత్వం ఆప్షనల్ హాలిడేగా ప్రకటిస్తూ జీవో జారీ చేసిందన్నారు. కావున రేపు జరగాల్సిన సోషల్ పరీక్ష యధావిధిగా జరుగుతుందని చెప్పారు. జిల్లాలోని డివైఈవోలు, ఎంఈవోలు, జడ్పీహెచ్ స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు. విద్యార్థులందరికీ విషయం తెలియపరచాలన్నారు.

Similar News

News April 5, 2025

మచిలీపట్నం: సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్: ఎస్పీ

image

మానవ తావాదం, ఆదర్శవాదం వంటి సద్గుణాలు కలిగిన మహోన్నత వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధరరావు అన్నారు. జగ్జీవన్ రామ్ 117వ జయంతిని జిల్లా ఎస్పీ క్యాంపు ఆఫీస్‌లో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎస్పీ ఇతర పోలీస్ అధికారులతో కలిసి జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

News April 5, 2025

ముంబైకి పొలార్డ్ లాంటి ప్లేయర్ ఇక దొరకడా?

image

IPLలో 5 టైమ్స్ ఛాంపియన్ ముంబై ప్రస్తుతం స్థాయికి తగ్గట్లుగా రాణించలేకపోతోంది. పొలార్డ్ లాంటి ఫినిషర్ లేకపోవడమూ దీనికి కారణమని ఫ్యాన్స్ అంటున్నారు. 2012 నుంచి 2021 వరకు ఎన్నో మ్యాచుల్లో MIకి ఆయన విజయాలు అందించారు. టైటిల్స్ సాధించడంలో కీలక పాత్ర పోషించారు. 2022లో ఫామ్ కోల్పోయి రిటైర్ అయ్యారు. ఆ తర్వాతి నుంచి MIకి సరైన ఫినిషర్ దొరకట్లేదనేది ఫ్యాన్స్ అభిప్రాయం. దీనిపై మీరేమంటారు?

News April 5, 2025

కొత్త ఆలోచనలతోనే రాష్ట్ర అభివృద్ధి: CBN

image

AP: ఆర్థికంగా వెనుకబడిన వారిని ఆదుకునేందుకు P4 కార్యక్రమాన్ని తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు చెప్పారు. NTR జిల్లా ముప్పాళ్లలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నేటి రోజుల్లో సెల్‌ఫోన్ అందరికీ అత్యవసర వస్తువుగా మారిందని, అనేక సేవలతో ప్రభుత్వానికి ఆదాయం వస్తోందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.

error: Content is protected !!