News April 6, 2025
అమృతలూరు: విద్యుత్ షాక్కు గురై యువకుడి మృతి

అమృతలూరు మండలం బోడపాడు గ్రామానికి చెందిన ఓ యువకుడు విద్యుత్ షాక్కు గురై మృతిచెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాంబాబు(25) శనివారం రాత్రి ఇంటిలో విద్యుత్ మరమ్మతులు చేస్తుండగా ప్రమాదం సంభవించింది. రాంబాబు రోజూ గుంటూరు పెయింటింగ్ పనికి వెళ్లి వస్తాడని, శనివారం ఇంటి దగ్గరే ఉండి కరెంట్ పనిచేస్తుండగా షాక్ కొట్టినట్లు తండ్రి సంసోను చెప్పారు. ఆ యువకుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 9, 2025
వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
News April 9, 2025
వరంగల్: క్రికెట్ బెట్టింగ్ కేసు.. 9 మంది అరెస్ట్

ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో యువత సులభంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో క్రికెట్ బెట్టింగులకు పాల్పడుతున్నారు. సీజన్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం నాలుగు క్రికెట్ బెట్టింగ్ కేసులు నమోదు చేసి, తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు సీపీ సన్ ప్రీత్ సింగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బుకీని సైతం అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు.
News April 9, 2025
YS జగన్ క్షమాపణ చెప్పకపోతే న్యాయపోరాటం: పోలీసుల సంఘం

AP: టీడీపీ అనుకూల పోలీసులను చట్టం ముందు బట్టలూడదీసి నిలబెడతామన్న <<16030703>>YS జగన్ వ్యాఖ్యలను<<>> పోలీసు అధికారుల సంఘం ఖండించింది. ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే న్యాయపోరాటం చేస్తామని తెలిపింది. పోలీసుల్లో మహిళలు కూడా ఉన్నారని జగన్ మరిచారా అని ప్రశ్నించింది. తీవ్ర ఒత్తిడి ఉన్న తమపై ఇలాంటి వ్యాఖ్యలు తగవని పేర్కొంది.